
పొదుపుతోనే ఆర్థిక స్వావలంబన
పహాడీషరీఫ్: చిన్న, మొత్తాల పొదుపు ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందని శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి పొదుపు సంఘం అధ్యక్షుడు మస్న రవికుమార్ అన్నారు. సంఘం 20వ వార్షిక మహాసభను జల్పల్లి మున్సిపాలిటీలోని శ్రీరామ కాలనీలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్త మార్కండేయ స్వామికి పూజలు చేశారు. 20 ఏళ్లల్లో సంఘం సాధించిన పురోగతిపై సభ్యులు చర్చించారు. ప్రస్తుతం 720 మందితో కొనసాగుతున్న సంఘంలో పొదుపు సంబంధించి పూర్తి పారదర్శకతను పాటిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడితో పాటు ఉపాధ్యక్షుడిగా ఒగ్గు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా భీమనపల్లి వెంకటేశ్, కోశాధికారిగా కెంచె శ్రీకాంత్, సహాయ కార్యదర్శిగా పున్న విష్ణు, సభ్యులుగా భిక్షపతి, శ్రీనివాస్, రమ్య, గుర్రం నరేశ్ను ఎన్నుకున్నారు. సమావేశంలో సంఘం వ్యవస్థాపకుడు గుర్రం శ్రీనివాస్, వినాయక పొదుపు సంఘం అధ్యక్షుడు కెంచె లక్ష్మీనారాయణ సంఘం సభ్యులకు సలహాలు, సూచనలు చేశారు.
పొదుపు సంఘం అధ్యక్షుడు రవికుమార్