
నూతన కార్యవర్గం ఎన్నిక
తుర్కయంజాల్: పురపాలక సంఘం పరిధి ఇంజాపూర్లోని స్నేహపురి కాలనీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం జరిగిన కాలనీ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 125 ఓట్లకు.. గంగిడి రాంరెడ్డికి 73, కట్టా అచ్యుత రెడ్డికి 52 ఓట్లు వచ్చాయి. దీంతో 21 ఓట్ల మెజార్టీతో గంగిరెడ్డి గెలిచి, అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. ప్రధాన కార్యదర్శిగా తంగెల్ల సతీష్ చారి, గౌరవ సలహాదారుగా వడ్ల భాస్కర్ చారి, ఛీప్ కో– ఆర్డినేటర్ ఆలేటి మల్లేశం, ఉపాధ్యక్షులుగా ఎడ్ల గౌరి శంకర్, పి.శ్రీపాల్, పి.తిరుపతయ్య, కార్యదర్శులుగా శ్రీనివాస చారి, యాదగిరి, మురళీ మోహన్, కోశాధికారిగా శ్రావణ్ కుమార్, సహ కోశాధికారిగా మహిపాల్ రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా రాజు గౌడ్, శ్రీనివాస్, ఐలయ్య, శాంత కుమారి, కార్యనిర్వాహక సభ్యులుగా చంద్రశేఖర్ రెడ్డి, సురేంద్ర, రామకృష్ణా రెడ్డి, శ్రీనివాస్, మురళీ, శ్రీనివాస్ రెడ్డి, అహ్మద్ బాష, కల్పన, అన్నపూర్ణ, సుచరితను ఎన్నుకున్నారు. అనంతరం నూతన సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.