
కోహెడ మార్కెట్కు త్వరలో శంకుస్థాపన!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కోహెడలో కొత్తగా నిర్మించతలపెట్టిన సమీకృత మార్కెట్ల నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. మొత్తం 250 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో పండ్లు, పూలు, కూరగాయలు, చేపలు, మాంసం ఉత్పత్తులకు సంబంధించిన మార్కెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే 241 ఎకరాలను సేకరించిన ప్రభుత్వం..తాజాగా మరో తొమ్మిది ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. సేకరించిన భూమిలో సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)ను కూడా సిద్ధం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయ నున్న ఈ మార్కెట్ నిర్మాణానికి రూ.2,890 కోట్లు ఖర్చు కానుందని అంచనా. త్వరలో టెండర్లు ఆహ్వానించి భూమిపూజ చేయనున్నట్లు తెలిసింది.
కేజీబీవీలో ఎంఎల్టీ కోర్సు
యాచారం: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఈ ఏడాది నుంచి ఎంఎల్టీ (మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్) ఇంటర్ కోర్సు ప్రారంభిస్తున్నట్లు విద్యాలయ ప్రత్యేకాధికారి అరుణశ్రీ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కోర్సులో 40 సీట్ల చొప్పున భర్తీ చేస్తామని తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో తరగతులు ఉంటాయన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. వివరాలకు 83318 33426 నంబర్లో సంప్రదించాలని ఆమె సూచించారు. ఎంఎల్టీ బోధించడానికి ఆసక్తి కలిగిన అధ్యాపకులు కూడా సంప్రదించాలని పేర్కొన్నారు.
ఈత, తాటి చెట్లను
నరకొద్దు
ఎకై ్సజ్ సీఐ బద్యనాథ్చౌహాన్
ఆమనగల్లు: అనుమతి లేకుండా ఈత, తాటి చెట్లను నరికితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆమనగల్లు ఎకై ్సజ్ సీఐ బద్యనాథ్చౌహాన్ హెచ్చరించారు. పట్టణంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఈత, తాటి చెట్ల నుంచి వచ్చే కల్లును విక్రయించి గౌడ కులస్తులు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. వీరు ప్రభుత్వం నుంచి లైసెన్స్ కలిగి ఉన్నారన్నారు. ఈత, తాటి చెట్లను నరకడం చట్ట ప్రకారం నేరమని చెప్పారు. తెలంగాణ ఎకై ్సజ్ యాక్ట్ 1968 ప్రకారం సొంత భూమిలోని ఈత, తాటి చెట్లను తొలగించాలన్నా ఎకై ్సజ్ శాఖ అనుమ తులు పొందాల్సి ఉంటుందని వివరించారు. అవసరమైన వారు పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్ పర్యవేక్షణలోని త్రిసభ్య కమిటీ పరిశీలించి కలెక్టర్కు నివేదిక అందజేస్తుందని తెలిపారు. కలెక్టర్ అనుమతితో వీటిని తొలగించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం ఒక్కో చెట్టుకు ప్రభుత్వానికి రూ.1,968 రుసుం చెల్లించాలన్నారు. ఎకై ్సజ్ శాఖ అనుమతి లేకుండా చెట్లను తొలగిస్తే మొదటి తప్పుగా భావించి 3 నెలల జైలు శిక్ష, రెండో సారి తొలగిస్తే 6 నెలల జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందన్నారు.