
మున్సిపాలిటీలకు అవార్డులు
శంకర్పల్లి/తుర్కయంజాల్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఉత్తమ పనితీరు కనబర్చిన మున్సిపాలిటీలకు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గత నెల 24న అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం నగరంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా శకంర్పల్లి, తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్లు యోగేశ్, కె.అమరేందర్ రెడ్డి అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్లు మాట్లాడుతూ.. అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరింత మెరుగ్గా పనిచేసేందుకు ఈ అవార్డులు దోహదం చేస్తాయన్నారు.