
నామినేటెడ్ పదవులు ఇవ్వాలని వినతి
షాద్నగర్: నియోజకవర్గంలోని ముఖ్య నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కోరుతూ గురువారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్కు వినతిపత్రం సమర్పించారు. పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు అంతా పార్టీ గెలుపుకోసం కృషి చేశారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్రెడ్డితో పాటు నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నేతలకు కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ పదవులు ఇవ్వా లని వినతిపత్రంలో పేర్కొన్నారు.