
పెద్దకుంట కబ్జా
కడ్తాల్: మండల పరిధిలోని వంపూగూడ గ్రామ సమీపంలో సర్వే నంబర్ 40లోని ‘పెద్దకుంట’కు సంబంధించిన 1.12 ఎకరాల ఎఫ్టీఎల్ భూమిని కబ్జా చేసిన వెంచర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బుధవారం గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రెవెన్యూ సదస్సుకు హాజరైన అధికారులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పోతుగంటి అశోక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం డిప్యూటీ తహసీల్దార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. వెంటనే పెద్దకుంటను సర్వే చేసి, హద్దులు నిర్ధారించాలని కోరారు.