
రెండు వాహనాలు ఢీ..
చేవెళ్ల: ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధి దామరగిద్ద బస్స్టేజి సమీపంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. హైదరాబాద్ చంపాపేట్కు చెందిన డ్రైవర్ శ్రీనివాస్.. ఎంజీ కారులో తనతో పాటు ముగ్గురు వ్యక్తులతో నగరం నుంచి వికారాబాద్వైపు వెళ్తున్నారు. చేవెళ్ల మండలం దామరగిద్ద సమీపంలోకి రాగానే.. వికారాబాద్ వైపు నుంచి చేవెళ్ల వైపు వస్తున్న ట్రాలీ ఆటో వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు, ఆటో ముందు భాగాలు దెబ్బతిన్నా యి. స్వల్పగాయాలతో ఆటో డ్రైవర్, కారులోని నలుగురు వ్యక్తులు బయటపడ్డారు. ఘటనా అనంతరం భారీగా ట్రాఫిక్ జాం అయింది. పోలీసులు వచ్చి రోడ్డుపై నుంచి రెండు వాహనాలను పక్కకు తొలగించి, ట్రాఫిక్ క్లియర్ చేశారు. గాయపడిన వారిని చేవెళ్లలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పో లీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఐదుగురికి స్వల్ప గాయాలు