భూ సమస్యలను పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యలను పరిష్కరించండి

Jun 4 2025 7:50 AM | Updated on Jun 4 2025 7:50 AM

భూ సమస్యలను పరిష్కరించండి

భూ సమస్యలను పరిష్కరించండి

యాచారం/మంచాల: రెవెన్యూ సదస్సులతోనైనా రైతుల భూ సమస్యలను పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగుడాల యాదయ్య ఆకాంక్షించారు. మండల పరిధిలోని తమ్మలోనిగూడ గేట్‌ వద్ద మంగళవారం నిర్వహించిన మండల కమిటీ, గ్రామ శాఖ కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాడు బీఆర్‌ఎస్‌ హయాంలో తెచ్చిన ధరణి పోర్టల్‌, నేడు కాంగ్రెస్‌ సర్కార్‌ తెచ్చిన భూ భారతి చట్టంతో రైతులకు ఏ మేరకు న్యాయం జరుగుతుందో అనుమానంగా ఉందన్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా పల్లెల్లో రోజురోజుకు భూ సమస్యలు పెరుగుతూనే ఉన్నాయన్నారు. భూ సమస్యలను పరిష్కరించే విషయంలో అధికారులకు చిత్తశుద్ధి కొరవడిందన్నారు. ఏళ్లుగా తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా రైతులు సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఫార్మాసిటీ గ్రామాల్లోని నిషేధిత జాబితాలో ఉన్న 2,200 ఎకరాల పట్టా భూముల రికార్డులను రైతుల పేరుపై నమోదు చేయాలని తిరుగుతున్నా చలనం లేదన్నారు. సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి నర్సింహ, నాయకులు అంజయ్య, బ్రహ్మయ్య, జంగయ్య, చందునాయక్‌, వెంకటయ్య, తావునాయక్‌, జగన్‌, బాల్‌రాజ్‌, భూషణ్‌, రమేష్‌, యాదగిరి, శ్రీరాములు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

భూములకు పట్టాలివ్వండి

మంచాల మండలంలోని చీదేడ్‌లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో తహసీల్దార్‌ వెంకటప్రసాద్‌కు పలు సమస్యలపై సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య వినతిపత్రం అందజేశారు. గ్రామంలో 97, 119 సర్వేనంబర్లలోని భూములకు పట్టాలివ్వాలని కోరారు. ఏళ్లుగా సాగుచేసుకుంటున్న రైతులకు నేటికీ పట్టాలు లేకపోవడం బాధకరమన్నారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు శ్యామ్‌సుందర్‌, నర్సింహ, వెంకయ్య, సత్తయ్య, వెంకటేష్‌, యదేశ్వర్‌, జంగయ్య, రామకృష్ణ, రవి, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement