
టీబీ పరీక్షలు తప్పనిసరి
యాలాల: రెండు వారాల పాటు ఎవరికై నా దగ్గు ఉంటే తప్పనిసరిగా టీబీ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ రవీంద్రయాదవ్ సూచించారు. మంగళవారం మండలంలోని అగ్గనూరు ఆరోగ్య ఉప కేంద్రంలో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మండల వైద్యాధికారి రుబియానాజ్తో కలిసి వైద్య శిబిరం నిర్వహించారు. రెండు వారాల పాటు దగ్గు, సాయంత్రం వేళ జ్వరం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, చాతిలో నొప్పిలాంటి లక్షణాలు కలిగిన 310 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. వారికి స్క్రీనింగ్ పరీక్షల అనంతరం 115 మందికి ఎక్స్రే తీసి వ్యాధిని గుర్తించినట్లు చెప్పారు. పాజిటివ్ వచ్చిన వారికి ఆరునెలల పాటు ఉచితంగా మందులతో పాట పౌష్టికాహారం కోసం నెలకు రూ. వెయ్యి చొప్పున రోగి ఖాతాలో జమ చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ఎన్ సుశీల, సూపర్వైజర్లు శోభారాణి, పల్లె దవాఖాన వైద్యురాలు భువనేశ్వరి, ఎంఎల్హెచ్పీ వైష్ణవి, టీబీ సూపర్వైజర్ రహత్ అలీ, ఏఎన్ఎంలు వీరమణి, రోజారమణి తదితరులు పాల్గొన్నారు.