
‘ఆరోపణల్లో వాస్తవం లేదు’
తుర్కయంజాల్: దళితులను కులం పేరుతో దూషించానంటూ తనపై చేసిన ఆరోపణలు, ఫిర్యాదులో ఎలాంటి వాస్తవం లేదని బీజేపీ సీనియర్ నాయకుడు కందాల బల్దేవ్రెడ్డి అన్నారు. శనివారం కొహెడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అబ్దుల్లాపూర్మెట్ రెవెన్యూ పరిధి కొహెడలోని సర్వే నంబర్ 956లో తనకు ఓపెన్ ప్లాట్ ఉండటంతోనే ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్లో ప్రధాన కార్యదర్శి పదవిని తీసుకున్నాని వివరణ ఇచ్చారు. కులమతాలకు అతీతంగా గ్రామంలో గత ముప్పై ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నానని తెలిపారు. తాను ఎవరి హక్కులకు భంగం కలిగించలేదని స్పష్టంచేశారు.