
శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి
మంచాల: శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. మండల పరిధిలోని ఆగాపల్లిలో నాగార్జునసాగర్– హైదరాబాద్ రోడ్డుపై మంచాల పోలీసులు ఏర్పాటు చేసిన వాహన తనిఖీ శిబిరాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అక్రమ రవాణా, నేరాలను అరికట్టడంలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈనెల 7న బక్రీద్ను దృష్టిలో పెట్టుకొని ఆవుల అక్రమ రవాణా నివారణ కోసం చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఏసీపీ రాజు, మంచాల సీఐ మధు తదితరులు పాల్గొన్నారు.
విద్యారంగాన్ని
కాపాడుకుందాం
టీఎస్యూటీఫ్ జిల్లా అధ్యక్షుడు
గోపాల్నాయక్
కడ్తాల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచి విద్యారంగాన్ని కాపాడుకుందామని టీఎస్యూటీఫ్ జిల్లా అధ్యక్షుడు గోపాల్నాయక్ పిలుపునిచ్చారు. సంఘం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు మండల పరిధిలోని అన్మాస్పల్లిలో సోమవారం ప్రచార జాత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ హితం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. అన్ని రకాల మౌలిక వసతులతో పాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారన్నారు. మన ఊరి బడిలో మన పిల్లలను చేర్పించి, మన బడిని మనమే కాపాడుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి శంకర్నాయక్, మండల అధ్యక్షుడు జంగయ్య, మాజీ సర్పంచ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
‘బెస్ట్ ప్రాక్టీస్’కు వెంకమ్మగూడ పాఠశాల హెచ్ఎం ఎంపిక
షాబాద్: హైదరాబాద్లోని రాష్ట్రస్థాయి విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధిలో వివిధ అభ్యసన పద్ధతులపై (బెస్ట్ ప్రాక్టీస్) నిర్వహించే ఉత్తమ ప్రదర్శనకు మండలంలోని వెంకమ్మగూడ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సింహాద్రినాయుడు ఎంపికయ్యారు. ఈ మేరకు ఎంఈఓ లక్ష్మణ్నాయక్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి నూతన అభ్యసన ప్రక్రియ ప్రదర్శనలకు సంబంధించి జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రదర్శనకు ఎంపికై న వాటిని రాష్ట్రస్థాయికి పంపించాలని ప్రభుత్వం జిల్లా విద్యాశాఖను ఆదేశించిందని తెలిపారు.
నిరంతరాయ విద్యుత్ సరఫరాకు కొత్త సబ్స్టేషన్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, హెచ్చు తగ్గుల నియంత్రణ, నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం కొంగరకలాన్లోని కలెక్టరేట్ భవన ఆవరణలో కొత్తగా 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మించనున్నట్లు సరూర్నగర్ ఎస్ఈ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన సబ్స్టేషన్ కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. సాధ్యమైనంత త్వరలో పనులు పూర్తి చేసి, సరఫరాను మెరుగుపర్చనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం డీఈ, ఏడీఈ, ఏఈ, ఇతర ఇంజనీర్లు ఉన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి

శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి

శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి