ఘనంగా ‘సెల్యూట్‌ టు సోల్జర్స్‌’ | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ‘సెల్యూట్‌ టు సోల్జర్స్‌’

Jun 3 2025 6:59 AM | Updated on Jun 3 2025 6:59 AM

ఘనంగా ‘సెల్యూట్‌ టు సోల్జర్స్‌’

ఘనంగా ‘సెల్యూట్‌ టు సోల్జర్స్‌’

చైతన్యపురి: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ నుంచి ప్రేరణ పొందిన ప్రజలు భిన్న రూపాల్లో దేశభక్తిని చాటుకున్నారని రిటైర్డ్‌ కలెక్టర్‌ ఎంవీ రెడ్డి అన్నారు. కోదాడ ఆత్మీయ ప్రవాస సమితి, అపోలో మెడికల్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ‘సెల్యూట్‌ టు సోల్జర్స్‌’ పేరిట చైతన్యపురిలోని అపోలో కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన సమావేశంలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బుర్రి రామయ్యతో కలిసి పాల్గొన్నారు. సంగోజు నాగాచారి అధ్యక్షతన జరిగిన సమావే శంలో ఆర్మీ అధికారులు పలువురు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం పోరాడుతున్న త్రివిధ ధళాల అధికారులు, సైనికుల సేవలను గుర్తు తెచ్చుకోవాలన్నారు. రిటైర్డ్‌ కల్నల్‌ సుంకర శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి యువత ఆర్మీలో చేరేందుకు అవగాహన కల్పించాలన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో పాల్గొన్న మేజర్‌ టి.సాయి భార్గవ్‌ తన అనుభవాలను వివరించారు. ఈసందర్భంగా మాజీ ఆర్మీ అధికారులు కల్నల్‌ స్వర్ణారెడ్డి, సుబేదార్‌ మేజర్‌ పీఎస్‌ఎన్‌ స్వామి, సార్జెంట్‌ జి.నర్సింహారెడ్డి, రామనాఽథం, వనం సుదర్శన్‌, దయా కర్‌రెడ్డి, సుబేదారు ఎస్‌.నర్సయ్య ను ఘనంగా సత్కరించి.. వారు చేసిన సేవలను కొని యాడారు. అనంతరం పహల్గాం మృతులు, పాకిస్తాన్‌ దాడుల్లో వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement