
భగవద్గీత పోటీల్లో బంగారు పతకం
షాద్నగర్రూరల్: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో భగవద్గీతపై రెండు రాష్ట్రాల మధ్య పోటీలు నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఈ పోటీల్లో పట్టణానికి చెందిన రాములు ప్రతిభ కనబరిచాడు. భగవద్గీతలోని 18 అధ్యాయాలు, 700 శ్లోకాలను అలవోకగా ఆలపించి పసిడి పతకాన్ని కై వసం చేసుకున్నాడు. ఈ మేరకు రాములును శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి అధ్యక్షుడు స్వరాజ్బాబు, కార్యదర్శి నక్కనర్సింలు అభినందించారు.
హరీశ్రావుకు
ఘన స్వాగతం
షాద్నగర్: మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం అంజన్న తండాలో ఆదివారం పార్టీ నాయకుడు నిర్వహించిన విందుకు వెళ్తున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావుకు షాద్నగర్ ఆ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్టణ శివారులోని కేశంపేట చౌరస్తాలో నాయకులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎంఎస్ నట్రాజన్, నాయకులు రాంబల్ నాయక్, లక్ష్మణ్ నాయక్, ఈట గణేశ్, చందు, నర్సింగ్రావు, విజయ్, లక్ష్మణ్ నాయక్, మోతీలాల్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
కష్టపడి చదివితే
ఫలితాలు సొంతం
ఇబ్రహీంపట్నం రూరల్: లక్ష్య సాధన కోసం కష్టపడి చదివితేనే ఫలితాలు సొంతం అవుతాయని హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్, ఎంసెట్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఇబ్రహీంపట్నం, యాచారం మండలాలకు చెందిన విద్యార్థులకు బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రాంరెడ్డి ఆధ్వర్యంలో అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు– 2025 ప్రదానం చేశారు. ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ సమీపంలోని ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకటాచారి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచి తమ లక్ష్యం వైపు అడుగులు వేయాలని సూచించారు. మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం 120 మంది విద్యార్థులకు నగదుతో పాటు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నరేందర్రెడ్డి, అంబర్పేట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సీఐ వెంకట్రెడ్డి, ఎకై ్సజ్ సీఐ ఏడుకొండలు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కూలిన ఎకై ్సజ్ కార్యాలయం పైకప్పు
కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు
షాద్నగర్రూరల్: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లలో అపశృతి చోటు చేసుకుంది. ఎకై ్స జ్శాఖ కార్యాలయం పై కప్పు కూలి ఓ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలైన ఘటన షాద్నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలివీ.. పట్టణంలోని ప్రభుత్వ ఎకై ్సజ్శాఖ కార్యాలయం కొన్నేళ్లుగా అద్దె భవనంలో కొనసాగుతోంది. ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకోసం అధికారులు కార్యాలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లలో భాగంగా కార్యాలయంపై జెండా దిమ్మెను కట్టేందుకు కానిస్టేబుల్ విజయకుమార్ ఆదివారం భవనంపైకి ఎక్కాడు. పై కప్పు అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో విజయ్కుమార్కు తీవ్ర గాయాలు కావ డంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తర లించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్కు తరలించారు.
విద్యార్థికి నగదుతో పాటు జ్ఞాపిక అందజేస్తున్న అతిథులు