
స్లాట్ బుకింగ్ @సబ్ రిజిస్ట్రార్
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ పద్ధతి ద్వారా ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానం సోమవారం నుంచి అమలులోకి రానుంది. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ స్లాట్ బుకింగ్ విధానంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ఏప్రిల్ 10న శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మొదటగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. గత నెల 12న మరో 25 కార్యాలయాల్లో ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన అన్ని కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం రిజిస్ట్రా ర్ కార్యాలయంలో స్లాట్ విధానం పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఇందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
సమయం ఆదా
స్లాట్ విధానంతో కేవలం 15 నిమిషాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. గంటల తరబడి కార్యాలయాల్లో క్రయవిక్రయదారులు నిరీక్షించాల్సిన తిప్పలు తప్పనున్నాయి. సమయం ఆదా కానుంది.
పొరపాట్లకు తావులేకుండా..
స్లాట్ బుకింగ్ వ్యవస్థ అమలులోకి రానున్న నేపథ్యంలో ఇబ్రహీంపట్నానికి అదనంగా మరో సబ్రిజిస్ట్రార్ రానున్నారు. అధికంగా రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో ఎలాంటి పొరబాట్లు జరగకుండా త్వరతిగతిన ప్రక్రియ పూర్తి చేసేందుకు అదనంగా మరో సబ్ రిజిస్ట్రార్ను నియమిస్తున్నారు. ఇబ్రహీంపట్నం కార్యా లయంలో నిత్యం 60 నుంచి 70కిపైగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఈ విధానం ద్వారా ఒక్కో సబ్ రిజిస్ట్రార్ 48 రిజిస్ట్రేషన్ల మాత్రమే చేయాల్సి ఉంటుంది. పనిభారం తగ్గి, వేగంగా రిజిస్ట్రేషన్లు చేసేందుకు అదనపు సబ్ రిజిస్ట్రార్ తప్పనిసరి కావాల్సి ఉంటుంది. ఈ కార్యాలయానికి అదనపు సబ్ రిజిస్ట్రార్గా హనుమంతురావును నియమించినట్లు సమాచారం.
ఇబ్రహీంపట్నంలో నేటి నుంచి అమల్లోకి..
అదనంగా మరో సబ్రిజిస్ట్రార్ కేటాయింపు
15 నిమిషాల్లోపు పూర్తికానున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ
తగ్గనున్న పని భారం.. నిరీక్షణకు తెర
ఇబ్బందులు కలగకుండా..
సోమవారం నుంచి స్లాట్ బుకింగ్ విధానంతో రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. 15 నిమిషాల్లోపు రిజిస్ట్రే షన్ పూర్తవుతుంది. క్రయవిక్రయదారులకు ఇబ్బందులు కలగకుండా ఈ ప్రక్రియ దోహదపడుతుంది.
– సోని, సబ్ రిజిస్ట్రార్, ఇబ్రహీంపట్నం

స్లాట్ బుకింగ్ @సబ్ రిజిస్ట్రార్