గంటల తరబడి.. జనాల తాకిడి | - | Sakshi
Sakshi News home page

గంటల తరబడి.. జనాల తాకిడి

Jun 2 2025 7:37 AM | Updated on Jun 2 2025 7:37 AM

గంటల

గంటల తరబడి.. జనాల తాకిడి

ఇబ్రహీంపట్నం: ఒకేసారి మూడు నెలల రేషన్‌ బియ్యం పంపిణీకి ఆదివారం మొదటిరోజు అడ్డంకులు ఎదురయ్యాయి. దుకాణాల్లోని ఈ పాస్‌ సర్వర్లు మొరాయించడంతో కార్డుదారులు ఇబ్బందులు పడ్డారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం కోటాలకు ఒకేసారి కాకుండా వేర్వేరుగా ఈ పాస్‌ మిషన్లపై వేలిముద్రలు వేయాల్సివచ్చింది. ఒక్కో కార్డుదారుడు ఆరుసార్లు వేలిముద్రలు వేయాల్సి పరిస్థితి వచ్చింది. దీనికితోడు సర్వర్లు మొరాయిస్తుండంతో ఒక్కొక్కరికి 15 నుంచి 20 నిమిషాలు సమయం పట్టింది. ఆయా దుకాణాల వద్ద గంటల తరబడి నిరీక్షించడం కనిపించింది. కొన్ని దుకాణాలను తెరవనేలేదు. నెలనెలా వచ్చే బాధ తప్పిందని భావించిన లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పలేదు.

చర్యలు తీసుకోవాలి

మూడు నెలల సన్న బియ్యం ఒకేసారి ఇస్తున్నారంటే సంతోషపడ్డాం. ప్రతీనెల రావాల్సిన పనితప్పిందని అనుకున్నాం. కానీ మిషన్లు సతాయిస్తుండటంతో గంటల తరబడి షాపు వద్ద ఎదురుచూడాల్సి వచ్చింది. సమయం వృథా అవుతోంది. కార్డుదారులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి.

– బాల్‌రాజ్‌, ఇబ్రహీంపట్నం

గంటల తరబడి.. జనాల తాకిడి 1
1/1

గంటల తరబడి.. జనాల తాకిడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement