
పంపిణీలో జాప్యం
షాద్నగర్: మూడు నెలలకు సంబంధించి కోటాను ఆదివారం నుంచి ఒకేసారి అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సర్కారు నిర్ణయించినా రేషన్ దుకాణాలకు మాత్రం పావు వంతు కూడా సరఫరా కాలేదు. నియోజకవర్గంలోని ఫరూఖ్నగర్లో 55 రేషన్ దుకాణాల్లో మూడు నెలలకుగాను 1,632 టన్నులు, కేశంపేటలో 29 దుకాణాలకు 682, కొత్తూరులో 13 షాపులకు 525, నందిగామలో 12 దుకాణాలకు 486, కొందుర్గులో 19 దుకాణాలకు 475, చౌదరిగూడలో 22 షాపులకు 505 టన్నుల బియ్యాన్ని స్టాక్ పాయింట్ నుంచి సరఫరా చేయాల్సి ఉంది. ఫరూఖ్నగర్కు 439 టన్నులు, కేశంపేటకు 93, కొందుర్గుకు 268, నందిగామకు 25, కొందుర్గుకు 60, చౌదరిగూడకు 48 టన్నుల బియ్యాన్ని పంపించారు. మొత్తం 4,312 టన్నులకు గాను సుమారు 1,200 టన్నుల మాత్రమే సరఫరా చేశారు. గత నెల 24వ తేదీ నుంచి అధికారులు బియ్యాన్ని లారీల ద్వారా సరఫరా చేస్తున్నా నేటికీ పూర్తి కాలేదు.