భార్యను కడతేర్చిన భర్త | - | Sakshi
Sakshi News home page

భార్యను కడతేర్చిన భర్త

May 15 2025 9:00 AM | Updated on May 15 2025 9:04 AM

భార్య

భార్యను కడతేర్చిన భర్త

పహాడీషరీఫ్‌: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసిన ఘటన బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ ఎం.సుధాకర్‌, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండ ప్రాంతానికి చెందిన జాకీర్‌ అహ్మద్‌, నాజియాబేగం(30) దంపతులు. వీరికి ఒక కూతు రు, ఇద్దరు కొడుకులు సంతానం. ఆటో నడుపుతూ జీవనం సాగించే జాకీర్‌ సంపాదనతో కుటుంబ పోషణ భారమైంది. దీంతో నాజియా ప్రైవేట్‌ జాబ్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమైపె అనుమానం పెంచుకున్న జాకీర్‌ తన మకాంను ఈనెల 1న బాలాపూర్‌ ఠాణా పరిధిలోని కొత్తపేట న్యూ గ్రీన్‌సిటీ కాలనీకి మార్చాడు. మంగళవారం అర్ధరాత్రి భార్య తో గొడవపడి కర్రతో తలపై మోది, గొంతుకు చున్నీ బిగించి హత్యచేశాడు. అక్కడి నుంచి పారిపోయి, బుధవారం ఉదయం అత్త రుబీనాబీకి ఫోన్‌ చేసి చెప్పాడు. తల్లి, కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించగా నాజియా అప్పటికే మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.

అనుమానంతో హత్య

భార్యను కడతేర్చిన భర్త 1
1/1

భార్యను కడతేర్చిన భర్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement