భావితరాలకు స్ఫూర్తి వాజ్‌పేయి | - | Sakshi
Sakshi News home page

భావితరాలకు స్ఫూర్తి వాజ్‌పేయి

May 1 2025 7:30 AM | Updated on May 1 2025 7:30 AM

భావితరాలకు స్ఫూర్తి వాజ్‌పేయి

భావితరాలకు స్ఫూర్తి వాజ్‌పేయి

మహేశ్వరం: దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. మండల పరిధిలోని నాగారంలో బీజేపీ మండల అధ్యక్షుడు యాదీష్‌ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వాజ్‌పేయి సంస్మరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు వాజ్‌పేయి తీసుకున్న నిర్ణయాలు జాతిని ముందుకు నడిపించాయని గుర్తుచేశారు. దేశంలో సుస్థిర, సుపరిపాలన అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇన్‌చార్జ్‌ మిద్దె సుదర్శన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్‌భూపాల్‌గౌడ్‌, రాష్ట్ర నాయకులు జయప్రకాశ్‌, కాశీనాథ్‌, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ ఈటల రాజేందర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement