
భావితరాలకు స్ఫూర్తి వాజ్పేయి
మహేశ్వరం: దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మండల పరిధిలోని నాగారంలో బీజేపీ మండల అధ్యక్షుడు యాదీష్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వాజ్పేయి సంస్మరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు వాజ్పేయి తీసుకున్న నిర్ణయాలు జాతిని ముందుకు నడిపించాయని గుర్తుచేశారు. దేశంలో సుస్థిర, సుపరిపాలన అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇన్చార్జ్ మిద్దె సుదర్శన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్భూపాల్గౌడ్, రాష్ట్ర నాయకులు జయప్రకాశ్, కాశీనాథ్, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ ఈటల రాజేందర్