కొందరు పనిగట్టుకుని వర్సిటీలో దళిత సిబ్బంది, విద్యార్థులపై అర్బన్ నక్సలైట్లంటూ విషప్రచారం చేస్తున్నారు. అందుకే, ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశాను. ఈ దుష్ప్రచారానికి కారకులను గుర్తించి లీగల్ నోటీసులు పంపుతున్నాం. సివిల్, క్రిమినల్ చర్యలకూ వెనకాడేది లేదు. ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, వ్యక్తిత్వ హననంపై వెనక్కి తగ్గేది లేదు. వర్సిటీలో దళితులపై జరుగుతున్న అకృత్యాలపై సోమవారం పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తాం.
– ఫ్రొఫెసర్ సుజాత, సోషియాలజీ విభాగాధిపతి


