నాణ్యమైన భోజనం పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన భోజనం పెట్టాలి

Oct 28 2025 7:40 AM | Updated on Oct 28 2025 7:40 AM

నాణ్యమైన భోజనం పెట్టాలి

నాణ్యమైన భోజనం పెట్టాలి

● మంచిగా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలి ● ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ● తంగళ్లపల్లి కేజీబీవీ తనిఖీ సిరిసిల్ల: రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం అధికారులతో మాట్లాడారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) నగేశ్‌, డీఆర్‌డీవో శేషాద్రి, రవాణా శాఖ జిల్లా అధికారి లక్ష్మణ్‌, జిల్లా పౌర సరఫరాల అధికారి బి.చంద్రప్రకాశ్‌, డీఏఓ అఫ్జల్‌ బేగం, డీసీవో రామకృష్ణ, మార్కెటింగ్‌ అధికారి ప్రకాశ్‌, సీసీఐ, డీసీఎంఎస్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, సీఎస్‌ రామకృష్ణారావులు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

● మంచిగా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలి ● ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ● తంగళ్లపల్లి కేజీబీవీ తనిఖీ

తంగళ్లపల్లి(సిరిసిల్ల): విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ సూచించారు. తంగళ్లపల్లి మండలం పద్మనగర్‌ కేజీబీవీని సోమవారం తనిఖీ చేశారు. స్టోర్‌రూమ్‌ను పరిశీలించారు. కోడిగుడ్లపై స్టాంప్‌ ఉండేలా చూసుకోవాలన్నారు. విద్యార్థులతోపాటు కింద కూర్చుని వారి భవిష్యత్‌ ప్రణాళికపై అవగాహన కల్పించారు. చదువుపై శ్రద్ధ పెట్టాలని, ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు. కేజీబీవీ స్పెషల్‌ అధికారి శ్యామల తదితరులు పాల్గొన్నారు.

మెరుగైన వైద్యసేవలు అందించాలి

ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ సూచించారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల పీహెచ్‌సీని తనిఖీ చేశారు. రక్తపరీక్షల ల్యాబ్‌, మందుల గది, వ్యాక్సిన్లు, మందులు పరిశీలించారు.

ఆలయ అభివృద్ధి, విస్తరణ పనుల్లో వేగం పెంచాలి

వేములవాడ: రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ పనుల్లో వేగం పెంచాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ సూచించారు. ఆలయ పనులు సోమవారం పరిశీలించి పలు సూచనలు చేశారు. బద్దిపోచమ్మ ఆలయ పనులపై ఆరా తీశారు. పనుల వివరాలను ఈవో రమాదేవి, ఆర్‌అండ్‌బీ అధికారులు వివరించారు. గుడిచెరువు ట్యాంక్‌బండ్‌ పనులను పరిశీలించారు. ఆర్డీవో రాధాబాయి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌ నిఖిత, ఆర్‌అండ్‌బీ ఈఈ నరసింహాచారి, వీటీడీఏ సీపీవో అన్సారీ, నీటి పారుదలశాఖ ఈఈ కిశోర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేశ్‌, తహసీల్దార్‌ విజయప్రకాశ్‌రావు, పర్యాటక సంస్థ ఎస్‌ఈ సరిత ఉన్నారు.

రైతులకు అందుబాటులో ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement