యూరియా ఇప్పించండి సార్లూ.. | - | Sakshi
Sakshi News home page

యూరియా ఇప్పించండి సార్లూ..

Sep 2 2025 8:13 AM | Updated on Sep 2 2025 8:13 AM

యూరియ

యూరియా ఇప్పించండి సార్లూ..

● జిల్లా వ్యాప్తంగా రైతుల రాస్తారోకో ● వేకువజాము నుంచే క్యూలైన్‌లు ● అయినా దొరకని బస్తాలు వేములవాడ/ముస్తాబాద్‌/వీర్నపల్లి/ఇల్లంతకుంట/వేములవాడఅర్బన్‌: యూరియా ఇప్పించాలని కోరుతూ రైతులు జిల్లా వ్యాప్తంగా సోమవారం నిరసనలు, ధర్నాలు చేపట్టారు. తెల్లవారుజాము నుంచే దుకాణాల వద్ద క్యూలో నిల్చున్నారు. అయినా యూరియా దొరక్కపోవడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డుపై బైఠాయించారు. ముస్తాబాద్‌లోని రాజీవ్‌చౌక్‌లో బీఆర్‌ఎస్‌ నాయకులు రైతులకు సంఘీభావంగా నిలిచారు. గంటల తరబడి వేచి ఉన్న టోకెన్లు ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్‌ సురేష్‌, ఎస్సై గణేశ్‌ అ క్కడికి చేరుకొని రెండు రోజుల్లో యూరియా వస్తుందని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. యూరియా కోసం వేములవాడలో రోడ్కెక్కిన రైతన్నలకు స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులు మద్దతుగా నిలిచారు. ఉదయం 6 గంటలకే దుకాణాల వద్ద చేరుకున్న రైతులకు సాయంత్రం 6 గంటలైనా ఒక్క బస్తా కూడా దొరక్కపోవడంతో ఆగ్రహంతో మున్సిపల్‌ ఆఫీస్‌ ఎదుట బైఠాయించారు. వీరికి బీఆర్‌ఎస్‌ నాయకులు మద్దతుగా నిలిచారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రైతులను రెచ్చగొడుతున్నారంటూ బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీఆర్‌ఎస్‌ వేములవాడ రూరల్‌ మండల అధ్యక్షుడు గోస్కుల రవి, సెస్‌ మాజీ డైరెక్టర్‌ రామతీర్థపు రాజు, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్‌, మారం కుమార్‌, నాయకులు అంజత్‌పాషా, గోపు మధు, రావికంటి సాయిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వేములవాడ ఠాణాలో ఉన్న బీఆర్‌ఎస్‌ నాయకులతో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు.

● జిల్లా వ్యాప్తంగా రైతుల రాస్తారోకో ● వేకువజాము నుంచే క్యూలైన్‌లు ● అయినా దొరకని బస్తాలు

రెండ బస్తాల కోసం గంటల తరబడి..

వీర్నపల్లి మండలం గర్జనపల్లికి 400 బస్తాల యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు 300 మంది తరలివచ్చారు. పోలీసులు క్యూలైన్‌లో నిల్చోబెట్టి ఒక్కో రైతుకు రెండు బస్తాలు ఇప్పించారు. అయినా గంటల తరబడి క్యూలైన్‌లో ఎదురుచూసేందుకు ఇబ్బంది పడ్డారు.

కూపన్లతోనే సరి

ఇల్లంతకుంట మండలంలోని వివిధ గ్రామాల రైతులకు సోమవారం ఇల్లంతకుంట రైతువేదికలో యూరియా కూపన్లను వ్యవసాయాధికారులు అందజేశారు. అనంతారం, రహీంఖాన్‌పేట, రేపాక, సిరికొండ, వంతడుపుల, ఇల్లంతకుంట గ్రామాల రైతులకు సాగు విస్తీర్ణాన్ని బట్టి 750 వరకు కూపన్లు అందజేసినట్లు ఏవో సురేశ్‌రెడ్డి తెలిపారు. ఏఈవోలు రవళి, అర్చన, లలిత, అభిషేక్‌, గంగ, తదితరులు పాల్గొన్నారు.

ఎదురుచూపులే..

యూరియా కోసం తెల్లవారుజామున 3 గంటలకు వచ్చిన రైతులకు మధ్యాహ్నం దాటిన బస్తాలు దొరక్కపోవడంతో అలసిపోయారు. చేసేదేమి లేక తమ వంతు వచ్చే వరకు ఎదురుగా ఉన్న షెట్టర్ల వద్ద పడుకున్నారు. మండల కేంద్రంలోని సాయిజ్యోతి గ్రామైక్య సంఘానికి 225 బస్తాలు వచ్చాయి. మిషన్‌ పనిచేయకపోవడంతో మంగళవారం ఇస్తామని అధికారులు చెప్పడంతో చేసేదేమి లేక వెనుదిరిగి వెళ్లిపోయారు.

యూరియా ఇదేం‘దయా’ !

వేములవాడలోని ప్రైవేట్‌ ఫర్టిలైజర్స్‌ దుకాణాల ఎదుట యూరియా కోసం రైతులు సోమవారం బారులుతీరారు. పత్తి, వరిపంటలకు యూరియా అవసరం కావడంతో పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ఒక్కో రైతుకు ఒక యూరియా బస్తా, అర లీటర్‌ నానో యూరియా డబ్బాను ఇస్తున్నారు. వీటి కోసం రైతులు గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉండి తీసుకెళ్తున్నారు.

వేములవాడలో 8 మందిపై కేసు

యూరియా ఇప్పించండి సార్లూ..1
1/2

యూరియా ఇప్పించండి సార్లూ..

యూరియా ఇప్పించండి సార్లూ..2
2/2

యూరియా ఇప్పించండి సార్లూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement