
గాడితప్పిన స్వచ్ఛత
● ‘మీరు చూస్తున్న ఈ ఫొటో సిరిసిల్ల మున్సిపల్ ప్రథమ చైర్పర్సన్ రుద్ర సత్తమ్మ కొడుకు రాజేంద్రప్రసాద్ ఇల్లు. వెంకంపేటలో గల తన ఇంట్లోకి ఇలా డ్రైనేజి నీరు వస్తుంటుంది. బయట డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక వర్షం పడినప్పుడు, డ్రైనేజీలో నీరు ఎక్కువగా ప్రవహించినప్పుడు ఇలా ఇంట్లోకి వస్తోంది. చాలా రోజులుగా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు.’
సిరిసిల్లటౌన్: స్వచ్ఛతలో ఘనకీర్తి సాధించిన సిరిసిల్లలో చెత్తపై చిత్తశుద్ధి కొరవడుతుంది. పలు వార్డులు, ప్రధాన కూడళ్లలో పారిశుధ్యం పడకేయడం విమర్శలకు తావిస్తుంది. నిత్యం చెత్తసేకరణలో ఆదర్శ విధానాలు అవలంబించిన బల్దియా ఇటీవల వెనక్కు తగ్గుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక విలీన గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వానాకాలం సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలో కొరవడిన పారిశుధ్యంపై కథనం.
మసకబారుతున్న స్వచ్ఛ బాధ్యత
తొమ్మిదేళ్లుగా సిరిసిల్ల బల్దియా జాతీయస్థాయిలో వందశాతం స్వచ్ఛత సాధిస్తూ వస్తుంది. బల్దియా పాలకవర్గం, అధికారులు పక్కా ప్రణాళికతో చెత్తసేకరణ పనులు చేపడుతున్నారు. అయితే ఇటీవల పారిశుధ్యంపై పట్టింపులేమితో విమర్శలు వస్తున్నాయి. మున్సిపల్ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన నిషేధం అమలు చేయడమే కాకుండా, ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా కట్టుదిట్టం చేయడంలో సఫ లీకృతులయ్యారు. పట్టణంలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకునేలా చేసి ఓడీఎఫ్ పట్టణంగా, పబ్లిక్ టాయిలెట్స్ వినియోగం, ప్లాస్టిక్ నిషేధం తదితర పనులతో ఓడీఎఫ్ ప్లస్ పట్టణంగా పేరొందింది. ఇంటింటికీ రెండు చెత్తబుట్టలు అందించి తడి, పొడి చెత్త సేకరిస్తూ వర్మీ కంపోస్టు(ఎరువు) తయారు చేయడంలో బల్దియా ముందుంటోంది. కానీ, ప్రస్తుతం పట్టణంలోని అన్ని కాలనీలతో పాటు విలీనమైన ఏడు గ్రామాల్లో చెత్తపై చిత్తశుద్ధి కరువవడం విమర్శలకు తావిస్తుంది.
చెత్తశుద్ధిని కొనసాగించాలి
● ప్రథమశ్రేణి మున్సిపల్గా ఆవిర్భవించిన సిరిసిల్లలో రోజూ ఉదయం 27 వాహనాలతో ఇంటింటా చెత్త సేకరిస్తారు.
● పారిశుధ్య పనులను ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, ఇన్చార్జి కమిషనర్ వాణి శానిటేషన్ విధులను పర్యవేక్షిస్తున్నారు. 23 రూట్లలో సుమారు 80 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.
● 39 వార్డుల్లో 277 మంది కార్మికులు, ప్రత్యేక అధికారులు అహర్నిశలు పని చేస్తూ పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా విధులు నిర్వర్తిస్తున్నారు.
● అయితే గతం పాలకవర్గం సభ్యులతో పాటు అధికారగణం రోజూ వార్డుల సందర్శనలో భాగంగా పారిశుధ్యం నూరుశాతం అమలు చేసేవారు. ప్రస్తుతం అధికారుల వార్డు సందర్శనలు అంతంతే అని ప్రజలు పేర్కొంటున్నారు.
సిరిసిల్ల మున్సిపల్ ప్రొఫైల్:
పట్టణ జనాభా 1,11,000
వార్డులు 39
శానిటేషన్ సిబ్బంది 277
రోజూ చెత్త ఉత్పత్తి 52 మెట్రిక్ టన్నులు
సేకరిస్తున్న చెత్త 48 మెట్రిక్ టన్నులు
రోజూ ప్లాస్టిక్ పదార్థాల ఉత్పత్తి 12 టన్నులు
సిరిసిల్ల బల్దియాలో పేరుకుపోతున్న చెత్తాచెదారం
పారిశుధ్యంపై కొరవడిన చిత్తశుద్ధి
విజృంభిస్తున్న వానాకాలం వ్యాధులు
మురికికూపాలుగా ఓపెన్ ప్లాట్లు
‘ఈ ఫొటోలో ఉన్నది సిరిసిల్ల జూనియర్ కళాశాల ముందు గల 5 రూపాయల భోజన నిలయం ముందు డస్ట్బిన్. చాలా రోజులుగా ఇలాగే చెత్తతో నిండి ఉంటోంది. జిల్లా కేంద్రంలోని ప్రధాన సెంటర్ అంబేడ్కర్ చౌరస్తాలో చెత్తడబ్బాలోంచి డస్ట్ను తీసుకెళ్లడానికి మూడ్రోజులుగా బల్దియా సిబ్బంది రావడం లేదు. నిత్యం వేలాది సంఖ్యలో జనం తిరిగే ఈప్రాంతం చెత్త చెదారంతో నిండడం విమర్శలకు తావిస్తుంది.’

గాడితప్పిన స్వచ్ఛత

గాడితప్పిన స్వచ్ఛత

గాడితప్పిన స్వచ్ఛత

గాడితప్పిన స్వచ్ఛత

గాడితప్పిన స్వచ్ఛత

గాడితప్పిన స్వచ్ఛత