
మాదకద్రవ్యాలను కట్టడి చేద్దాం
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా
సిరిసిల్ల: జిల్లాలో మాదకద్రవ్యాలను కట్టడి చేద్దామని, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ఝా కోరారు. కలెక్టరేట్లో మంగళవారం ఎస్పీ మహే శ్ బీ గితేతో కలిసి నార్కోటిక్ కంట్రోల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణకు జిల్లా నార్కోటిక్ సమావేశంలో పాల్గొనే ప్ర తి శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని అమలు చేయాలన్నారు. జిల్లాలో వస్త్ర పరిశ్రమ కార్మికులు మద్యానికి బానిసై అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నారని, వాటిని నియంత్రించాలన్నారు. స్కూళ్లు, కాలేజీలు, గురుకులాల్లో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై వైద్య అధికారులతో అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలో డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి, అవసరమైన వారికి చికిత్స అందించాలని సూచించారు. జిల్లాలో గంజాయి సాగు కనిపిస్తే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ, యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేసి ర్యాగింగ్ మొదటి దశలోనే కట్టడి చేయాలని, కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల అలవాట్లను, నడవడికను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. ఈ సందర్భంగా ‘జాగ్రత్త!! మాదక ద్రవ్యాలు..మీ జీవితా న్ని నాశనం చేస్తాయి...డ్రగ్స్ కు నో చెప్పండి’ అనే పోస్టర్లు రిలీజ్ చేశారు. సమావేశంలో డీఎంహెచ్వో ఎస్.రజిత, డీఏవో అఫ్జల్ బేగం, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్ పాల్గొన్నారు.
రైతుభరోసాతో అన్నదాతలకు ఆసరా
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రైతు భరోసాతో అన్నదాతలకు ప్రభుత్వం ఆసరాగా నిలుస్తుందని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు భరోసా విజయోత్సవ సంబరాల్లో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్ రైతువేదికలో హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి సీఎం ప్రసంగాన్ని వీక్షించారు. డీఏవో అఫ్జల్బేగం, ఏఎంసీ చైర్పర్సన్ సాబేరా బేగం, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.