
సిరిసిల్ల బల్దియా కమిషనర్గా ఖాదర్పాషా
సిరిసిల్లటౌన్: సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్గా ఖాదర్పాషాను ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలు, పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి 39 మంది కమిషనర్లను నియమించింది. ఈమేరకు మంగళవారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్గా ఉన్న ఖాదర్పాషా ప్రథమ శ్రేణి మున్సిపాలిటీ సిరిసిల్ల కు కమిషనర్గా పదోన్నతిపై రానున్నారు. ఇక్కడ కమిషనర్గా పనిచేసిన ఎస్.సమ్మయ్య ఏప్రిల్ 22న అకస్మాత్తుగా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. డీఈఈగా పనిచేస్తున్న పోసు వాణి ఇన్చార్జి కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు.
ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ఉత్తమ పౌరులుగా ఎదగాలని డీఈవో వినోద్కుమార్ సూచించారు. మండలంలోని రాచర్లబొప్పాపూర్, ఎల్లారెడ్డిపేట, కోరుట్లపేట ప్రభుత్వ పాఠశాలలను మంగళవారం సందర్శించారు. జెడ్పీహెచ్ఎస్ బొ ప్పాపూర్లో పదోతరగతి విద్యార్థులతో మా ట్లాడారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా అదనపు తరగతి గదులకు ప్రతిపాదనలు పంపాలని హెచ్ఎంకు సూచించారు. కోరుట్లపేట ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. ఎల్లారెడ్డిపేట హైస్కూల్లో మధ్యాహ్న భోజనం పరిశీలించి, నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కోఆర్డినేటర్ శ్రీధర్, ఎంఈవో గాలిపల్లి కృష్ణహరి, హెచ్ఎంలు మనోహరాచారి, సత్తయ్య, మధుమాలతి పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
సిరిసిల్ల/సిరిసిల్లకల్చరల్: సాహసరంగంలో పాల్గొన్న వ్యక్తులను గుర్తించి టెన్సింగ్ నార్కే నేషనల్ అడ్వెంచర్ అవార్డుతో సత్కరించేందుకు యు వజన క్రీడల శాఖ నిర్ణయించిందని జిల్లా డీఎస్డీవో అజ్మీర రాందాస్ తెలి పారు. ఈ మేరకు http:// awards. gov. in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. భూమి, సముద్రం, ఆకాశంలో సాహసయాత్రలు చేసినవారి నుంచి అందిన దరఖాస్తుల్లోంచి ఎంపిక చేస్తామన్నా రు. అదనంగా సాహసరంగంలో జీవితకాల సాధన పురస్కారాన్ని కూ డా అందజేస్తామన్నారు. అర్హత గల సాహసికులు మూడేళ్లుగా నిర్వహించిన సాహసకృత్యాల నేపథ్యంలో దరఖాస్తు చేసుకోవాలన్నా రు. వివరాలకు 94402 39783 నంబర్ను సంప్రదించాలని సూచించారు.
ప్రైవేట్ స్కూల్ వ్యాన్ అడ్డగింత
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని గొల్లపల్లి(వట్టిమల్ల) గ్రామంలో ప్రైవేట్ స్కూళ్లకు చెందిన వ్యాన్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి చిన్నారులను ప్రభుత్వ పాఠశాలకే పంపాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. మాజీ సర్పంచ్ గోపు పర్శరాములు, మాజీ ఉపసర్పంచ్ భుక్యా రాజు పాల్గొన్నారు.
వామపక్షాల నిరసన
సిరిసిల్లటౌన్: ఇరాన్పై అమెరికా బాంబుదా డులకు పాల్పడడంపై వామపక్షాలు మండిపడ్డాయి. మంగళవారం జిల్లా కేంద్రంలో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను హోరెత్తించారు. ఈసందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ మాట్లాడుతూ, ఇరాన్పై అమెరికా బాంబుదాడులు చేసి ఆసియా ఖండాన్ని యుద్ధమంటల్లోకి నె ట్టి ప్రపంచశాంతికి విఘాతం కలిగించిందని విమర్శించారు. నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, మల్లారపు అరుణ్కుమార్, జువ్వాజి విమల, ఎర్రవెల్లి నాగరాజు పాల్గొన్నారు. అలాగే సీపీఐ నా యకులు గాంధీచౌక్లో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. జిల్లా కార్యవర్గ స భ్యులు ఎలిగేటి రాజశేఖర్, కడారి రాములు, మీసం లక్ష్మణ్, తిరుపతిరెడ్డి, అనిల్ పాల్గొన్నారు.

సిరిసిల్ల బల్దియా కమిషనర్గా ఖాదర్పాషా

సిరిసిల్ల బల్దియా కమిషనర్గా ఖాదర్పాషా