జిల్లాలో రైతు భరోసా రూ.145.24 కోట్లు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో రైతు భరోసా రూ.145.24 కోట్లు

Jun 25 2025 7:16 AM | Updated on Jun 25 2025 7:16 AM

జిల్లాలో రైతు భరోసా రూ.145.24 కోట్లు

జిల్లాలో రైతు భరోసా రూ.145.24 కోట్లు

సిరిసిల్ల: జిల్లాలోని రైతులకు వానాకాలం సీజన్‌ వ్యవసాయ పెట్టుబడులకు రైతు భరోసా పథకంలో రూ.145.24 కోట్లు జమ అయ్యాయని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా మంగళవారం తెలిపారు. జిల్లాలోని 13 మండలాల పరిధిలో 1,24,292 మంది రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో రూ.145,24,03,068 డబ్బులు జమ అయ్యాయని పేర్కొన్నారు. రైతులు వ్యవసాయ పెట్టుబడులకు ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసాను వినియోగించుకోవాలని కోరారు.

సామాజిక తనిఖీ ప్రజావేదిక

తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని 30 గ్రామాలకు సంబంధించి నాల్గో విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో డీఆర్‌డీవో శేషాద్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉపాధి పనులకు సంబంధించి రూ.6,92,25,556, దాంతోపాటు పంచాయతీరాజ్‌ పనులు రూ.2,27,99,287 గాను సామాజిక తనిఖీ గ్రామ సభల్లో సేకరించిన వివరాలను డీఆర్పీలు చదివి వినిపించారు. కొన్ని గ్రామాల్లో చెల్లింపులకు సంబంధించి నిర్వహణ లోపం గుర్తించి ఫెనాల్టీ, రికవరీ రూ.45,886 జరిమానాు విధించినట్లు డీఆర్‌డీవో తెలిపారు. సమావేశంలో ఎంపీడీవో కె.లక్ష్మీనారాయణ, ఎంపీవో మీర్జా అఫ్జల్‌ అహ్మద్‌ బేగ్‌, తనిఖీ అధికారులు రామారావు, పంచాయతీ కార్యదర్శులు, ఎస్‌ఆర్పీలు, ఈజీఎస్‌ సిబ్బంది, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement