సమగ్ర అభివృద్ధికి బాటలు వేద్దాం | - | Sakshi
Sakshi News home page

సమగ్ర అభివృద్ధికి బాటలు వేద్దాం

Jun 23 2025 8:43 PM | Updated on Jun 23 2025 8:43 PM

సమగ్ర

సమగ్ర అభివృద్ధికి బాటలు వేద్దాం

వాతావరణం
ఆకాశం మేఘావృతమవుతుంది. వర్షం కురిసే అవకాశం లేదు. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. రాత్రి వేళ ఈదురుగాలులు వీస్తాయి.
వర్షం కోసం కప్పతల్లి ఆట
బోయినపల్లి(చొప్పదండి): వర్షాలు కురవాలని కోరుతూ బోయినపల్లిలో ఆదివారం కప్పతల్లి ఆట ఆడారు. మొదట గ్రామ దేవతలకు జలాభిషేకాలు చేశారు.
● పథకాల అమలులో పారదర్శకత పాటించాలి ● కష్టకాలంలోనూ పథకాలు అమలు చేస్తున్నాం ● విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యం ● జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ● మూడు శాఖలపై నాలుగు గంటలపాటు సమీక్ష

సోమవారం శ్రీ 23 శ్రీ జూన్‌ శ్రీ 2025

కరీంనగర్‌:

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా సమగ్ర అభివృద్ధికి బాసటగా నిలవాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో వ్యవసాయం, విద్య, హౌసింగ్‌ శాఖలపై మంత్రులు పొన్నం ప్రభాకర్‌, దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి నాలుగు గంటలపాటు సమీక్షించారు. వర్షాభావ పరిస్థితులు, క్రాప్‌ బుకింగ్‌, సాగు వివరాలు, విత్తనాలు, ఎరువుల లభ్యత, రైతుభరోసా, ఆయిల్‌ పాం సాగు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, గ్రౌండింగ్‌తీరును ఆయా జిల్లాల కలెక్టర్లు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అస్తవ్యస్త పరిస్థితులను సరిచేస్తూ.. పాలన సాగిస్తున్నామని, ఎక్కడా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. జూలై వరకు అవసరమైన విత్తనాలు, ఎరువుల స్టాక్‌ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అవసరమైన మేరకే యూరి యా వాడాలన్నారు. ఆయిల్‌పాం సాగుపై మరింత శ్రద్ధ చూపి జిల్లాలకు కేటాయించిన లక్ష్యాన్ని మించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, విద్యాశాఖ అధికారులు శిథిలావస్థలో ఉన్న భవనాలను ఖాళీ చేయించాలన్నారు.

● రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ నిరుపేదలందరికీ ఇందిర మ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఎమ్మెల్యేల దృష్టిలో ఉన్న నిరుపేదల జాబితాను కలెక్టర్లకు అందిస్తే ఇందిరమ్మ కమిటీలో చర్చించి పార్టీలకతీతంగా మంజూరు చేస్తామన్నారు. కూరగాయ ల సాగు విస్తరించాలని, కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

● మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ రైతు భరోసా రైతుల ఖాతాలో జమ చేస్తున్నందుకు మంత్రి తుమ్మలకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులు ఆయిల్‌ పాం సాగువైపు దృష్టి సారించాలన్నారు. క్యాష్‌ క్రాప్స్‌, హార్టికల్చర్‌ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలన్నారు.

● వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఎరువుల కొరత లేదన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని, రైతుభరోసా ఖాతాల్లో జమ అవుతోందని తెలిపారు. వేములవాడలో సూరమ్మ ప్రాజెక్టు, శ్రీపాద నారాయణపురం ప్రాజెక్టుల భూ సేకరణ నిధులు విడుదల చేయాలని కోరారు.

● కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ ఆయిల్‌ పాం సాగును ప్రోత్సహించాలన్నారు. తాను 48 ఎకరాల్లో ఆయిల్‌ పాం సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఆయిల్‌ పాం ప్రాసెస్‌ యూనిట్‌ను చిగురుమామిడిలో ఏర్పాటు చే యాలని కోరారు. కరీంనగర్‌లో గతంలో సీఎం స్పెషల్‌ ఫండ్‌ కింద రూ.350 కోట్లతో 120రోడ్ల పనులు ప్రారంభించామని, వాటిని పూర్తి చేయి ంచాలని విజ్ఞప్తి చేశారు. కేబుల్‌ బ్రిడ్జి డైనమిక్‌ లైటింగ్‌ వ్యవస్థ పనితీరు పర్యవేక్షించాలన్నారు.

● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ సీడ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ జగిత్యాల ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఆయిల్‌పాం సాగుపై అవగాహన కల్పిస్తున్నామని, పంటకు ధర పెంచేలా చూడాలని అన్నారు.

● కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో ఎమ్మెల్యేల జాబితాను పరిగణనలోకి తీసుకోవాలని కోరా రు. మెట్‌పల్లి హైస్కూల్‌ శిథిలావస్థలో ఉందని, పక్కనే జూనియర్‌ కళాశాల భవనం 80శాతం పూర్తయిందని, దానిని పూర్తి చేసి స్కూల్‌ పిల్లలను ఆ భవనానికి తరలించాలని అన్నారు. ఉర్దూ ప్రభుత్వ పాఠశాల పనులు పూర్తిచేయాలని కోరారు.

● పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు మాట్లాడుతూ వ్యవసాయంపై గ్రామాల్లో సదస్సులు పెట్టి రైతులకు సలహాలు, సూచనలను శాస్త్రవేత్తల ద్వారా ఇప్పించామన్నారు. పంట మార్పిడిపై ప్రచారం చేయాల్సిన అవస రం ఉందన్నారు. ఐదేళ్లుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పత్తి పంట తగ్గిపోతోందని, వరి, మొక్కజొన్న సాగు పెరుగుతోందని అన్నారు.

● రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఎత్తిపోతలు పూర్తి చేయడంతో అంతర్గాం, పాలకుర్తి మండలాలకు తొలిసారి సాగునీరు వచ్చిందని, గతం కంటే రెండింతల పంట పండుతోందని తెలిపారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌, కేశోరాం సిమెంట్‌ వంటి సంస్థల డీఎంఎఫ్‌టీ నిధులు జిల్లాకు రావడం లేదని అన్నారు.

● మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు చదవడం, రాయడం, సామాన్య, గణితం వంటి విద్యా ప్రమాణాలు పెంచేలా చూడాలన్నారు. వృత్తి విద్యా కోర్సుల ద్వారా యువతను ప్రయోజకులను చేసేందుకు స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటును స్వాగతించారు.

● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ చొప్పదండి ప్రాంతంలోని చేనేత కార్మికుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, గంగాధర మండలానికి డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని కోరారు.

● సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల కలెక్టర్లు పమేలా సత్పతి, కోయ శ్రీహర్ష, సందీప్‌ కుమార్‌ ఝా, సత్య ప్రసాద్‌, రాష్ట్ర మినిమం వేజ్‌బోర్డు సలహా మండలి చైర్మన్‌ జనక్‌ప్రసాద్‌, కరీంనగర్‌, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్లు సత్తు మల్లేశం, కేడం లింగమూర్తి, నాగుల సత్యనారాయణ, ఆర్టీఏ మెంబర్‌ పడాల రాహుల్‌, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

‘రేషన్‌లో చక్కెర ఇవ్వాలి’

సిరిసిల్లటౌన్‌: రేషన్‌షాపుల్లో ఏఏవై కార్డుదారులకు చక్కెర పంపిణీ చేయాలని సిరిసిల్ల పౌరసంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యంకార్‌ శ్రీనివాస్‌ కోరారు. సిరిసిల్లలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఏఏవై కార్డుదారులకు నెలకో కిలో చొప్పున మూడు నెలలకు మూడు కిలోలకు బదులు ఒకే కిలో ఇస్తున్నారన్నారు. డీఎస్‌వో స్పందించాలని కోరారు. సమితి కోశాధికారి చిప్ప దేవదాస్‌, సభ్యులు వేముల పోసెట్టి, దేవులపల్లి శ్రీరాములు పాల్గొన్నారు.

న్యూస్‌రీల్‌

సమగ్ర అభివృద్ధికి బాటలు వేద్దాం1
1/3

సమగ్ర అభివృద్ధికి బాటలు వేద్దాం

సమగ్ర అభివృద్ధికి బాటలు వేద్దాం2
2/3

సమగ్ర అభివృద్ధికి బాటలు వేద్దాం

సమగ్ర అభివృద్ధికి బాటలు వేద్దాం3
3/3

సమగ్ర అభివృద్ధికి బాటలు వేద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement