నిషా తెగింపు | - | Sakshi
Sakshi News home page

నిషా తెగింపు

Jun 23 2025 8:43 PM | Updated on Jun 23 2025 8:43 PM

నిషా

నిషా తెగింపు

సిరిసిల్ల: మత్తులో యువత చిత్తవుతున్నారు. మద్యం..గంజాయి సేవిస్తూ నిషాలో తూగుతున్నా రు. మత్తులోనే రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు కారణ మవుతున్నారు. పోలీసులు నిత్యం డ్రంకెన్‌డ్రైవ్‌ తని ఖీలు చేస్తున్నా మందుబాబులు మారడం లేదు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 90 శాతం తాగిన మైకంలోనే జరుగుతున్నాయి. మద్యంషాపులు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండడంతోపాటు అక్రమంగా నిర్వహించే బెల్ట్‌షాపులు ప్రతి ఊరులోనూ ఉండడంతో మత్తు ఆవహిస్తుంది. గంజాయిని సిగరేట్లు.. చాక్‌లేట్లలో వినియోగిస్తూ యువతరం మత్తులో మునుగుతోంది.

కట్టడి చేయలేని కన్నవాళ్లు

● పిల్లలు యువకులుగా మారే క్రమంలో వారిని కట్టడి చేయడం తల్లిదండ్రులకు సాధ్యం కావడం లేదు. యువకులు బయట ఏం చేస్తున్నారో.. ఏం సేవిస్తున్నారో చూసే సమయం తల్లిదండ్రులకు లేకుండా పోతోంది. ప్రాథమిక దశలో గుర్తించకపోవడంతోనే మత్తుకు బానిసలుగా మారిపోతున్నారు. చేయిదాటిన తర్వాత గుర్తించిన ఏం చేయలేని అసహాయస్థితిలో కన్నవాళ్లు కుమిలిపోతున్నారు.

● ఇటీవల సిరిసిల్ల పట్టణ శివారులో పోలీసులు తనిఖీలు చేస్తుండగా కారులో వచ్చిన యువకుడు ఒకరు మత్తులో ఉన్నాడు. పోలీసులు బ్రీథింగ్‌ అనలైజర్‌తో చెక్‌ చేయగా.. మత్తులో ఉన్నట్లు నిర్ధారణ అయింది. వెంటనే పోలీసులు కారు కీస్‌ తీసుకోగా.. సదరు యువకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అతన్ని, కారును పోలీసులు ఠాణాకు పంపించారు. మత్తు దిగిన తరువాత పోలీసులు తమదైన శైలిలో మర్యాద చేశారు. జరిగిన విషయం తెలిసి అతని తల్లిదండ్రులు తల్లిడిల్లిపోయారు. ఇలా జిల్లాలో పిల్లల చర్యలతో పెద్దలు ఇబ్బందులు పడుతున్నారు.

● చందుర్తికి చెందిన ఓ యువకుడు మద్యం మత్తులోనే తన సొంత పెద్దమ్మ తలను కత్తితో నరికి ధర్జాగా ఠాణాకు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. గతంలోనూ హత్యచేసిన సదరు యువకుడు గంజాయి, మద్యంకు బానిసకావడంతో ఇలాంటి అఘాయితాల్యలకు బరితెగించాడు.

కేసులకూ భయపడని వైనం

● జిల్లాలో నిత్యం డ్రంకెన్‌డ్రైవ్‌ కేసులు, బహిరంగంగా మద్యం సేవించే కేసులు నమోదవుతున్నాయి. కానీ యువకులు పోలీసు కేసులకూ భయపడడం లేదు. డ్రంకెన్‌డ్రైవ్‌ కేసుల్లో జైలుశిక్షలు పడుతున్నా మద్యం మత్తును వదలడం లేదు. సినిమాలు, సోషల్‌మీడియా ప్రభావంతో యువత పెడదారుల్లో సాగుతోంది. పోలీసులనే ఎదిరించడం, వాదించడం, కేసుల్లో ఇరుక్కోవడం జరుగుతుంది. మత్తులో జరుగుతున్న ఘటనలతో అభం శుభం తెలియని వ్యక్తులు, ఆ వ్యక్తులపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

బాధ్యత అందరిదీ..

● మద్యం, గంజాయి, డ్రగ్స్‌ మత్తును వదిలించేందుకు ప్రభుత్వ యంత్రాంగంలోని అన్ని శాఖలు, పౌరసమాజం బాధ్యత తీసుకోవాల్సిందే. జిల్లాలో అనధికారికంగా నడుస్తున్న బెల్ట్‌షాపులను కట్టడి చేయాలి. మరోవైపు గంజాయి సరఫరా చేస్తున్న ముఠాలను పట్టుకోవాలి. మద్యం తాగితే రోడ్డు ఎక్కకుండా అడ్డుకోవాలి. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. మత్తుకు బానిసలుగా మారిన వారిని డీ–ఆడిక్షన్‌ సెంటర్లకు పంపించి వైద్యం చేయించాలి. స్కూల్‌, కళాశాల స్థాయిల్లో మత్తు ప్రభావాన్ని వివరిస్తూ అవగాహన కల్పించాలి. పోలీసుల తనిఖీలు పెరగాలి. తప్పుచేస్తే శిక్ష పడుతుందనే భయం ఉండాలి. మత్తును వదిలించేందుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వశాఖలు నడుం బిగించాల్సిన అవసరం ఉంది.

మత్తులో యువతచిత్తు

రోడ్డు ప్రమాదాలు.. పోతున్న ప్రాణాలు

మద్యం మత్తు.. గంజాయి జోష్‌

కట్టడి చేయలేకపోతున్న కన్నవాళ్లు

పోలీస్‌ కేసులకూ భయపడని వైనం

అది వేములవాడ అర్బన్‌ మండలం రుద్రవరం స్టేజీ. ఎప్పుడూ సందడిగా ఉండే వేములవాడ–కరీంనగర్‌ ప్రధాన రహదారి. బుధవారం రాత్రి ఎవరి పనులు వారు ముగించుకుని ఇళ్లకు చేరుతున్న వేళ నాంపల్లి వైపు నుంచి ఓ కారు దూసుకొచ్చింది. రోడ్డు పక్కన వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. అంతే.. ఆ వాహనంపై ఉన్న యువకుడు దర్శి(35) అక్కడికక్కడే మృతిచెందాడు. అందరూ చూస్తుండగానే ఆ కారు వేగంగా కరీంనగర్‌ వైపు వెళ్లింది. సరిగ్గా రెండు కిలోమీటర్లు వెళ్లగానే ఆరెపల్లి స్టేజీ వద్ద మరో ద్విచక్రవాహనాన్ని అదే కారు ఢీకొట్టింది. మల్యాల పండరీనాథ్‌(25) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ద్విచక్రవాహనం వెనుక కూర్చున్న చందు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ రెండు ఘటనలకు కారణమైన వ్యక్తి కరీంనగర్‌ పట్టణ శివారులోని రేకుర్తికి చెందిన యువకుడు రాచకొండ రాజశేఖర్‌(21). మద్యంమత్తులో కారుడ్రైవింగ్‌ చేసి రెండు నిండు ప్రాణాలను బలితీసుకోవడమే కాకుండా.. తాను తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ రోడ్డు ప్రమాదంలో మృతుడు పండరీనాథ్‌కు 25 రోజుల కిందటే పెళ్లి కాగా.. దర్శి వలస కార్మికుడు.

తంగళ్లపల్లి మండలం నేరెళ్ల వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో

వేములవాడ శివారులోని చింతలఠాణా ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చెందిన కుర్మ నరేశ్‌(38) మరణించాడు. నరేశ్‌ సిద్దిపేట వైపు వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి, ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించాడు. ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తి 22 ఏళ్ల యువకుడు. ఉదయం పూటనే మత్తులో ఉన్నాడు. వాహనదారులపైకి ఎదురుతిరుగుతూ పదేళ్లు జైలుకు వెళ్తానంటూ.. మర్లపడి మాట్లాడుతున్నాడు. అతనికి బ్రీథింగ్‌ అనలైజర్‌ పరీక్ష చేయగా 219 పాయింట్లు మత్తు వచ్చింది. ఇలా తాగిన మైకంలో ఓ నిండు ప్రాణాన్ని సదరు యువకుడు నషాళానికి ఎక్కిన నిషాలో బలితీసుకున్నాడు.

నిషా తెగింపు1
1/3

నిషా తెగింపు

నిషా తెగింపు2
2/3

నిషా తెగింపు

నిషా తెగింపు3
3/3

నిషా తెగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement