రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు

May 29 2025 1:25 AM | Updated on May 29 2025 1:25 AM

రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు

రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు

సిరిసిల్ల: జిల్లాలో యాసంగి(రబీ) సీజన్‌లో రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేసినట్లు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా బుధవారం తెలిపారు. 242 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటివరకు 37,223 మంది రైతుల వద్ద రూ.578 కోట్ల విలువైన 2,49,372మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. వీటిలో 2,16,258 మెట్రిక్‌ టన్నుల ధాన్యం వివరాలు ఆన్‌లైన్‌ చేశామని, 34,479 మంది రైతుల బ్యాంకు ఖాతాలో రూ.447 కోట్లు జమ అయ్యాయని వివరించారు. మిగతా రైతులకు త్వరలో డబ్బులు జమ అవుతాయని ప్రకటించారు. జిల్లాలో ధాన్యం సేకరణ తుది దశకు వచ్చిందని, ఇప్పటికే 133 కొనుగోలు కేంద్రాలను మూసివేశామన్నారు. ఇంకా 109 కేంద్రాల్లో కొద్దిగా ధాన్యం ఉందన్నారు. జిల్లాలో చివరి గింజ వరకు దాన్యం సేకరిస్తామని తెలిపారు. తడిసిన ధాన్యం సైతం సేకరిస్తామని రైతులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు.

మూడేళ్లలో ధాన్యం సేకరణ తీరిదీ

జిల్లాలో రబీ(యాసంగి) సీజన్‌లో మూడేళ్ల ధాన్యం సేకరణ తీరును కలెక్టర్‌ గణాంకాలతో వెల్లడించారు. 2022–2023లో మే 28వ తేదీ నాటికి 1,64,044 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించామని, అదే 2023–2024 రబీ సీజన్‌లో ఇదే రోజు నాటికి 2,49,514 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది మే 28వ తేదీ నాటికి 2,49,372 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించామని అన్నారు. జిల్లాలో కొనుగోళ్లు పూర్తి అయ్యేనాటికి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు నమోదు అవుతాయని స్పష్టం చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇప్పటికే 2,49,372 మెట్రిక్‌ టన్నుల సేకరణ

కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement