సీపీఐని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లండి | - | Sakshi
Sakshi News home page

సీపీఐని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లండి

May 29 2025 1:17 AM | Updated on May 29 2025 1:17 AM

సీపీఐని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లండి

సీపీఐని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లండి

కరీంనగర్‌: జిల్లాలో సీపీఐకి పూర్వవైభవాన్ని తెచ్చేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా మహాసభలు రెండోరోజు కొనసాగాయి. నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్‌, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు కిన్నెర మల్లవ్వ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మూడేళ్లలో జిల్లాలో నిర్వహించిన పార్టీ కార్యక్రమాల నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ సీపీఐకి జిల్లాలో ఘనమైన చరిత్ర ఉందన్నారు. తెలంగాణ దశాదిశా నిర్దేశించేలా క్రియాశీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఆర్‌ఎన్‌ఎన్‌ శక్తుల విజృంభన కొనసాగిస్తూ బీజేపీ ప్రమాదకరంగా మారిందన్నారు. రాష్ట్రంలో పెన్షన్‌, రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మఇళ్లు పథకాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్‌, మర్రి వెంకటస్వామి, పొనగంటి కేదారి, బోయిని అశోక్‌, కొయ్యడ సృజన్‌కుమార్‌, అందె స్వామి, బత్తుల బాబు, గూడెం లక్ష్మి పాల్గొన్నారు.

పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement