
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో జిల్లా ప్రథమ స్థానం
సిరిసిల్లకల్చరల్: ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు.కలెక్టరేట్లో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై అధికారులతో సమీక్షించారు, జిల్లాకు 7,862 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా వేములవాడ నియోజకవర్గంలో రెండు దశల్లో 2,575, సిరిసిల్ల నియోజకవర్గంలో 3,608. చొప్పదండి నియోజకవర్గంలోని బోయిన్పల్లిలో 820 ఇళ్లు మంజూరు చేశామని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ విషయంలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు. అదే స్ఫూర్తితో నిర్మాణాలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సిమెంట్, స్టీల్ ధరల విషయంలో ఆయా కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరిపి తగ్గించే ప్రయత్నం చేస్తుందన్నారు. నిర్మాణం పూర్తయిన ఇళ్ల ఫొటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు , హౌసింగ్ పీడీ శంకర్, ఆయా మండలాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
‘రాజీవ్ యువ వికాసం’లో
లాభసాటి యూనిట్లు
సిరిసిల్ల: రాజీవ్ యువ వికాసం పథకంలో లాభసాటి వ్యాపార యూనిట్లను ఏర్పాటు చేయిస్తామని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. హైదరాబాద్ సచివాలయం నుంచి బుధవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిరిసిల్ల జిల్లాలో రాజీవ్ యువ వికాసం అమలు తీరుపై కలెక్టర్ వివరించారు.