
ఒక్క ఏడాదిలోనే 818 ఇళ్లు
బోయినపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోగా బోయినపల్లి మండలానికి 818 ఇళ్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బుధవారం హైస్కూల్ మైదానంలో కలెక్టర్ సందీప్కుమార్ ఝాతో కలిసి 709 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, 98 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. అత్తగారి మండలానికి అల్లుడిగా మాజీ సీఎం కేసీఆర్, మనవళ్లుగా కేటీఆర్, సంతోశ్కుమార్లు ఇచ్చింది పెద్ద గుండుసున్న అని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి సహకారంతో మిడ్మానేరు ముంపు గ్రామాలకు త్వరలో మరో వెయ్యి ఇళ్లు మంజూరు కానున్నాయని తెలిపారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా మా ట్లాడుతూ మంజూరు పత్రాలు పొందిన వారు ఇళ్లు నిర్మించి వచ్చే దసరా, దీపావళి పర్వదినాలను సొంత ఇళ్లలో జరుపుకోవాలని అన్నారు. లబ్ధిదారులకు ఇసుక అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 90 రోజుల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించకుంటే రద్దు చేస్తామన్నారు. జెడ్పీ సీఈవో వినోద్, ఎంపీడీవో జయశీల, తహసీల్దార్ నారాయణరెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రవీందర్, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్యాదవ్ పాల్గొన్నారు.