
గర్భస్థ శిశువును రక్షించడం అందరి బాధ్యత
సిరిసిల్ల: గర్భస్థ శిశువును రక్షించాల్సిన బాధ్య త ప్రతీ ఒక్కరిపై ఉందని జిల్లా వైద్య, ఆరో గ్యశాఖ అధికారి ఎస్.రజిత అన్నారు. కలెక్టరేట్లోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పీసీపీఎన్డీటీ సలహా కమిటీ సమావేశంలో మాట్లాడారు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమన్నారు. ఎవరైన భ్రూణహత్యలకు పాల్ప డితే టోల్ఫ్రీ నంబర్ 94400 54641కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్ అంజలి ఆల్ఫ్రెడ్, అనిత, రామకృష్ణ, మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్, లీగల్ అడ్వైజర్ శాంతి ప్రకాశ్ శుక్లా, ఝాన్సీలక్ష్మి శుక్లా, డిప్యూటీ డెమో రాజకుమార్, హెచ్ఈ బాలయ్య, డీఈవో మహేశ్ పాల్గొన్నారు.
బద్దెనపల్లి గురుకులానికి క్యాష్ అవార్డు
తంగళ్లపల్లి: మండలంలోని బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకల పాఠశాలకు అరుదైన గౌరవం దక్కింది. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్లో పాఠశాల ప్రిన్సిపాల్ దర్శనాల పద్మకు అవార్డుతోపా టు రూ.5 లక్షల రివార్డు అందజేశారు. పీఎంశ్రీ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్, పదో తరగతి ఫలితాల్లో రా ష్ట్రస్థాయి ఉత్తమ ఫలితాలు సాధించినందుకు ఈ అవార్డు అందజేశారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎంపీసీలో రాష్ట్రస్థాయి రెండో ర్యా ంకు సాధించిన విద్యార్థిని నందినికి రూ. 10వేలు నగదు పారితోషకం అందించారు.
హామీలు నెరవేర్చండి
సిరిసిల్లటౌన్: ప్రొటోకాల్ అమలుపై కాంగ్రెసోళ్ల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉన్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. బుధవారం సిరిసిల్ల ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ విప్ ప్రొటోకాల్ విషయంపై చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీ సులో దేశ నేతల ఫొటోలు పెట్టుకోవడం స హజమని, కాంగ్రెసోళ్లు ప్రభుత్వ బంగ్లాకు చొ చ్చుకుపోయి సీఎం రేవంత్రెడ్డి ఫొటో పెట్టేందుకు ఒడిగట్టడం అప్రజాస్వామికమన్నారు. అడ్డుకోబోయిన పోలీసులను నెట్టేస్తూ బీఆర్ఎస్ నేతలపై దాడి చేయడం సరికాదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక అనవసర రాద్దాంతం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం కాంగ్రెస్కు వెన్నెతో పెట్టిన విద్య అన్నారు. ఈ సమావేశంలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపా ణి, రాష్ట్ర నాయకులు ప్రవీణ్, రాజు, శ్రీనివా స్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఇళ్ల పరిహారంపై నేడు మరోసారి విచారణ
బోయినపల్లి(చొప్పదండి): మిడ్మానేరు ప్రా జెక్టులో ముంపునకు గురైన బోయినపల్లి మండలం వరదవెల్లి అనుబంధ రాజన్నపేట గ్రా మంలోని 9 ఇళ్ల పరిహారం చెల్లింపులపై వచ్చిన ఆరోపణలతో గురువారం మరోసారి విచారణ జరుగనుంది. కలెక్టర్ సందీప్కుమా ర్ ఝా ఆదేశాలతో డీఎల్పీవో నరేశ్ ఈనెల 19న వరదవెల్లి జీపీ కార్యాలయంలో విచారణ జరిపారు. ఆ రోజు విచారణకు ఎవరూ హాజరు కాకపోవడంతో ఫిర్యాదుదారులకు, ఇళ్ల యజమానులకు ముందుగా నోటీసులు అందించి మరోసారి 29న విచారణ నిర్వహి ంచనున్నారు. ఈసారి విచారణలో ఏం జరుగుతుందో? అని ఎదురుచూస్తున్నారు.
యూరియా వాడకం
తగ్గించుకోవాలి
కోనరావుపేట: రైతులు సాగులో యూరియా వాడకం తగ్గించుకోవాలని జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ కె.మదన్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం మామిడిపల్లిలోని ఆదర్శ సొసైటీలో నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో మాట్లాడారు. పంట మార్పిడి పాటిస్తూ అధిక దిగుబడులు పొందాలని సూచించారు.

గర్భస్థ శిశువును రక్షించడం అందరి బాధ్యత

గర్భస్థ శిశువును రక్షించడం అందరి బాధ్యత