
ఆశీర్వచనాలు.. పరామర్శలు
ముస్తాబాద్(సిరిసిల్ల): బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ముస్తాబాద్ మండలంలో శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. బందనకల్లో పెద్దమ్మ–పెద్దిరాజుల కల్యాణ ఉత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నామాపూర్లో శ్రీవరాల మల్లికార్జునస్వామి ఆలయ వార్షికోత్సవానికి హాజరయ్యారు. ఆవునూర్ మడేలేశ్వరస్వామి వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ముస్తాబాద్, గూడెం, ఆవునూర్లో నూతన వధూవరులను ఆశీర్వదించారు. బందనకల్లో మాజీ ఎంపీటీసీ రామచంద్రారెడ్డిని, చిగురు నరేశ్ను పరామర్శించారు. ముస్తాబాద్లో తిరుమల నర్సింగ్హోంను సందర్శించి, ఇటీవల ప్రారంభించిన ఐసీయూ యూనిట్ను పరిశీలించారు. కేటీఆర్ వెంట నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, కల్వకుంట్ల గోపాల్రావు, మండలాధ్యక్షుడు బొంపెల్లి సురేందర్రావు, డాక్టర్ చంద్రశేఖర్రావు, సర్వర్, సంతోష్రావు, మనోహర్, జహంగీర్, స్వామి, వెంకటస్వామి పాల్గొన్నారు.
● జిల్లాలో కేటీఆర్ సుడిగాలి పర్యటన