
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం
సిరిసిల్లటౌన్: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలాపై పోరాటం తప్పదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ అన్నారు. యూనియన్ పిలుపులో భాగంగా మంగళవారం స్థానిక బీౖవైనగర్లోని పార్టీ ఆఫీసులో ఫ్లకార్డులతో నిరసన చేపట్టి మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికవర్గం పోరాడి సాధించుకున్న చట్టాలు, హక్కులను మోదీ ప్రభుత్వం తొలగించి పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికై నా నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని లేకుంటే కార్మికవర్గ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్నల్దాస్ గణేశ్, సూరం పద్మ, నక్క దేవదాస్, బెజుగం సురేశ్, జిందం కమలాకర్, బింగి సంపత్, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.