
జాతీయస్థాయిలో రాణించాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్లటౌన్: జిల్లా క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళా శాల గ్రౌండ్లో గురువారం రాత్రి జిల్లా స్థాయి ఆ హ్వానిత వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. విజేతగా సి రిసిల్లకు చెందిన స్యాట్ టీమ్, ద్వితీయ స్థానంలో సిరిసిల్ల వీబీఏ టీమ్ నిలిచాయి. తృతీయ గంభీ రావుపేట, నాలుగోస్థానంలో రుద్రంగి జట్లు నిలి చాయి. విజేతలకు నగదు పారితోషికంతోపాటు ట్రోఫీ అందించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, కాంగ్రెస్ ప ట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, వాలీబాల్ అ సోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీకుమార్, ప్రధాన కార్యదర్శి అజ్మీర రాందాస్, గుడ్ల రవి, కోడం శ్రీ నివాస్, నారాయణ, గడ్డం నర్సయ్య, బొప్ప దేవయ్య, సంపత్, సురేష్ పాల్గొన్నారు.