
గుడిసెలో ఉంటున్నం
రెండేళ్ల క్రిందట డబుల్బెడ్రూమ్ ఇల్లు సాంక్షన్ అచ్చిందని చెప్పిండ్రు. రూ.3లక్షలు అప్పు చేసి బేస్మెంట్, పిల్లర్ల వరకు కట్టుకున్న. నా పెనిమిటి దుబాయ్కు పోతే అక్కడ మోసం చేసిండ్రు. ఇంటికొచ్చి, గుంట జాగ అమ్మి మళ్లా దుబాయ్కు పోయిండు. నా బిడ్డ, నేను గుడిసెలో ఉంటున్నం. కలెక్టర్ సారూ.. ఇందిరమ్మ ఇల్లు సాంక్షన్ ఇప్పించి ఆదుకోవాలే.
– లింగాల గౌరవ్వ, చీకోడు
ప్రభుత్వానికి నివేదించాం
గతంలో డబుల్బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ఆర్అండ్బీ చూసింది. ఇళ్ల పనులు మొదలుపెట్టిన వారి వివరాలు.. ఎంతమేరకు బిల్లులు చెల్లించామో అధికారులకు అందించాం. 2బీహెచ్కే లబ్ధిదారులు, బిల్లులు రాని వివరాలు ఉన్నతాధికారులకు తెలియజేశాం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గృహనిర్మాణ శాఖకు అప్పగించారు.
– శాంతయ్య, ఆర్అండ్బీ డీఈఈ