రెండు గృహాల్లో చోరీ | - | Sakshi
Sakshi News home page

రెండు గృహాల్లో చోరీ

Jun 3 2025 5:47 AM | Updated on Jun 3 2025 5:47 AM

రెండు

రెండు గృహాల్లో చోరీ

2 తులాల బంగారం,

రూ.36 వేల నగదు అపహరణ

జరుగుమల్లి(సింగరాయకొండ): తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీకి తెగబడ్డారు. ఈ సంఘటన జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటలోని ఎస్టీ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి చోటచేసుకుంది. కాలనీలోని వల్లెపు అంజమ్మ, వేటగిరి ప్రశాంతి ఇళ్ల తాళాలు పగలగొట్టి సుమారు 2 తులాల బంగారం, రూ.36 వేల నగదు చోరీ చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై బి.మహేంద్ర తెలిపారు.

దుకాణాల్లోకి

దూసుకెళ్లిన లారీ

పెద్దారవీడు: బత్తాయి లోడ్‌తో వేగంగా వెళ్తున్న లారీ కూల్‌డ్రింక్‌, జ్యూస్‌ షాపుల్లోకి దుసుకెళ్లింది. ఈ సంఘటన పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టు బస్టాండ్‌లో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కనిగిరి ప్రాంతం నుంచి బత్తాయి లోడుతో రాజస్థాన్‌కు వెళ్తున్న లారీ దేవరాజుగట్టు జంక్షన్‌లోని హైవే అండర్‌ పాస్‌ మూలమలుపు వద్ద అదుపు తప్పింది. తెల్లవారుజామున లారీ డ్రైవర్‌కు రూట్‌ అర్థం కాక నేరుగా షాపుల ముందున్న విద్యుత్‌ స్తంభాలను ఢీకొట్టి దూసుకెళ్లింది. భారీ శబ్ధం రావడంతో స్థానికులు భయందోళన చెంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యుత్‌ స్తంభాలు విరిగి తీగలు వేలాడుతుండటంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సరఫరాను నిలుపుదల చేశారు. కూల్‌డ్రింక్‌ దుకాణం యజమాని మునగపాటి నాగరామాచారికి రూ.1.50 లక్షలు, జ్యూస్‌ షాప్‌ యజమాని సుబానీకి రూ.40 వేల మేర నష్టం వాటిల్లింది. లారీ డ్రైవర్‌, క్లీనర్‌కు స్వల్ప గాయాలు కాగా మార్కాపురం జీజీహెచ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పవర్‌లిఫ్టింగ్‌లో

యువత రాణించాలి

ఒంగోలు: పవర్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి జిల్లా ఖ్యాతి ఇనుమడింపజేయాలని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక మినీ స్టేడియంలో పవర్‌ లిఫ్టింగ్‌ రాష్ట్రస్థాయి ముగింపు పోటీలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చివరిరోజు నిర్వహించిన జూనియర్‌ మెన్‌ బెంచ్‌ ప్రెస్‌, పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో విజేతలకు మెమెంటోలు, పతకాలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో వివిధ విభాగాలలో రాష్ట్రస్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకుని మిగతా వారు సాధన చేయాలని సూచించారు. రాష్ట్రస్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన వారు జాతీయ స్థాయి పోటీలలో సైతం సత్తా చాటి రాష్ట్ర క్రీడాఖ్యాతిని ఇనుమడింపజేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి జి.రాజరాజేశ్వరి, పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ప్రభాకరరావు, గంటా వెంకటేశ్వర్లు, సౌత్‌ జోన్‌ సెక్రటరీ సకల సూర్యనారాయణరావు, జిల్లా ఉపాధ్యక్షుడు పవన్‌కుమార్‌, కార్యదర్శి జి.భక్తధృవుడు తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు.

రెండు గృహాల్లో చోరీ 
1
1/1

రెండు గృహాల్లో చోరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement