
మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలి
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పశ్చిమ ప్రాంత ప్రజలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యాన్ని, వైద్య విద్యను అందించాలనే లక్ష్యంతో మార్కాపురం మండలం రాయవరం వద్ద రూ.475 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టారు. 75 శాతం పనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పనులు నిలిచిపోయాయి. ఈ ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నాలు చేయడం దారుణం. ప్రభుత్వమే మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని చేపట్టి, పూర్తి చేసి వైద్య విద్యను, కార్పొరేట్ వైద్య సేవలను అందించాలి. పశ్చిమ ప్రకాశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువ. జీజీహెచ్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి.
– అందె నాసరయ్య, మెడికల్ కాలేజీ పరిరక్షణ కమిటీ కన్వీనర్, మార్కాపురం