అతి వేగం.. టిప్పర్‌ బీభత్సం | - | Sakshi
Sakshi News home page

అతి వేగం.. టిప్పర్‌ బీభత్సం

May 30 2025 12:42 AM | Updated on May 30 2025 1:01 AM

అతి వ

అతి వేగం.. టిప్పర్‌ బీభత్సం

పొదిలి: మితిమీరిన వేగంతో వెళ్తున్న టిప్పర్‌ అదుపు తప్పి బైక్‌ను ఢీకొట్టడమే కాకుండా పెట్రోల్‌ బంకులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బీభత్సం సృష్టించిన ఈ సంఘటన గురువారం పొదిలి నగర పంచాయతీ పరిధిలోని కాటూరివారిపాలెం సమీపంలో ఒంగోలు–కర్నూలు హైవేపై చోటుచేసుకుంది. వివరాలు.. వినుకొండకు చెందిన పెనుమాల్ల లక్ష్మీనారాయణ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతను డ్రైవింగ్‌ చేసే మినీ లారీ మర్రిపూడి మండలం చిమట గ్రామంలో బొప్పాయి కాయల లోడింగ్‌కు వెళ్లింది. లారీ ఓనర్‌ తాను డ్రైవింగ్‌ చేస్తానని చెప్పి తన మోటారుసైకిల్‌పై లక్ష్మీనారాయణను వెళ్లాలని సూచించాడు. బైక్‌పై పొదిలి వైపు వస్తున్న లక్ష్మీనారాయణను కాటూరివారిపాలెం సమీపంలోని పెట్రోల్‌ బంకు వద్ద వేగంగా వస్తున్న టిప్పర్‌ ఢీకొట్టింది. బైక్‌ను తొక్కుకుంటూ పెట్రోల్‌ బంకు వైపు దూసుకెళ్లిన టిప్పర్‌ అక్కడ ఉన్న హోర్డింగ్‌లను ఢీకొట్టి, సిమెంటు దిమ్మె పైకి ఎక్కింది. పెట్రోల్‌ బంకులోకి నేరుగా దూసుకెళ్లి ఉంటే పెను ప్రమాదమే జరిగేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన లక్ష్మీనారాయణను పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. టిప్పర్‌ డ్రైవర్‌ మద్యం తాగి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

సురక్షితమైన తాగునీరు అందించాలి

పొదిలి రూరల్‌: ఇంటింటికి సురక్షితమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ జల్‌ జీవన్‌ నోడల్‌ అధికారి వి.దినేష్‌కుమార్‌ అన్నారు. మండలంలోని అక్కచెరువు గ్రామంలో రూ.96.10 లక్షలతో చేపట్టిన జల జీవన్‌ మిషన్‌ పథకం పనులను గురువారంఆయన పరిశీలించారు. తొలుత పంచాయతీ కార్యాలయంలో పథకానికి సంబంధించి పనుల పురోగతిని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ బాల శంకర్‌రావు ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. తరువాత రికార్డులు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ జలజీవన్‌ మిషన్‌ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడి భూగర్భనీటి వనరులు పెంచాలన్నారు. ఈ పథకం అమల్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని గ్రామస్తులు అడిగారు. ఈ క్రమంలో గృహఆలు హెచ్చు తగ్గులుగా ఉండటంతో శివారు ప్రాంతాలకు నీరు సరఫరా అందడం లేదని తెలిపారు. అనంతరం కొత్తగా నిర్మించిన వాటర్‌ ట్యాంకు, ఇంటింటికీ ఏర్పాటు చేసిన నీటి కుళాయి, పశువుల షెడ్డు, ఫారంపాండ్లను పరిశీలించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ జోసఫ్‌కుమార్‌, ఎంపీడీఓ విజయలక్ష్మి, సర్పంచ్‌ చేరెడ్డి నాగలక్ష్మి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేడు జాబ్‌మేళా

ఒంగోలు వన్‌టౌన్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి కె.రవితేజ యాదవ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండ్లూరు డొంక మహిళా ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుంచి జాబ్‌మేళా నిర్వహిస్తామన్నారు. జాబ్‌మేళాలో పాల్గొనే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. అభ్యర్థులు 10వ తరగతి ఆపైన విద్యార్హత ఉండాలన్నారు. ఇంటర్వ్యూలో ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం ఇస్తామన్నారు. పూర్తి వివరాలకు 9963005209 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

బైక్‌ను ఢీకొట్టి, పెట్రోల్‌ బంకులోకి దూసుకెళ్లిన వైనం

ఒకరికి తీవ్ర గాయాలు

జలజీవన్‌ మిషన్‌ నోడల్‌ అధికారి దినేష్‌కుమార్‌

అతి వేగం.. టిప్పర్‌ బీభత్సం 1
1/2

అతి వేగం.. టిప్పర్‌ బీభత్సం

అతి వేగం.. టిప్పర్‌ బీభత్సం 2
2/2

అతి వేగం.. టిప్పర్‌ బీభత్సం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement