
ట్రిపుల్ ఐటీ తరలింపు...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సొంత భవనాలు నిర్మించి అభివృద్ధి చేస్తామని గత ఎన్నికల్లో చంద్రబాబుతో పాటు ఒంగోలు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు. అదంతా నిజమేనని జిల్లా ప్రజలు నమ్మారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రిపుల్ ఐటీకి సొంత భవనాలు నిర్మించకుండా ఏడాదిగా కాలయాపన చేస్తున్నారు. అంతేగాకుండా గత వ్రభుత్వ హయాంలో ఇడుపులపాయలో ఇబ్బంది పడుతున్న ఒంగోలు క్యాంపస్ విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని వారిని ఒంగోలు తరలించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒంగోలు క్యాంపస్ విద్యార్థులను తిరిగి ఇడుపులపాయకు తరలిస్తోంది. ఈ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.