
తనిఖీల్లో కిరికిరి.. థియేటర్లపైనే గురి!
సాక్షి నెట్వర్క్: ‘కూటమి ప్రభుత్వంపై సినీ పరిశ్రమకు కృతజ్ఞత లేదు. మీ కోసం ఎంతో చేస్తే ఇలా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా..’ అంటూ ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. థియేటర్లకు అద్దె కాకుండా షేర్ ఇవ్వాలని యజమానుల యూనియన్ కోరిన నేపథ్యంలో బంద్ ప్రస్తావన తెరపైకి రావడం, దీనిపై లోతుగా విచారించాలని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. థియేటర్లలో వసతులు, టికెట్ ధరలు, తినుబండారాల ధరలను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని డీప్యూటీ సీఎం కార్యాలయం ఆదేశించడంతో రెవెన్యూ అధికారులు రెండు రోజులుగా తనిఖీలు చేపడుతున్నారు. జిల్లాలోనూ శుక్రవారం తనిఖీలు ప్రారంభించారు. అయితే నేరుగా థియేటర్లను మాత్రమే తనిఖీ చేస్తే ప్రజల్లోకి మరో విధంగా సందేశం వెళ్తుందని భావించిన కూటమి పాలకులు రూటు మార్చారు. పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడౌన్లు, ఎంఎల్ఎస్ పాయింట్లు, ఆర్టీసీ డిపోలు తదితర వ్యాపార కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించడం గమనార్హం.

తనిఖీల్లో కిరికిరి.. థియేటర్లపైనే గురి!

తనిఖీల్లో కిరికిరి.. థియేటర్లపైనే గురి!

తనిఖీల్లో కిరికిరి.. థియేటర్లపైనే గురి!

తనిఖీల్లో కిరికిరి.. థియేటర్లపైనే గురి!