
అటకెక్కిన మంచినీటి పథకం...
రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న ఒంగోలు నగరంలో 3.50 లక్షల జనాభా ఉన్నారు. 50 డివిజన్లకుపైగా విస్తరించింది. అయితే, ఒంగోలు నగర, నగర శివారు ప్రాంతాల ప్రజలను మంచినీటి కొరత వేధిస్తోంది. జిల్లా పర్యటనకు వచ్చిన ఆప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడంతో వెంటనే స్పందించారు. నగర ప్రజలకు ప్రతిరోజూ మంచినీరు అందించేందుకు రూ.350 కోట్లు మంజూరు చేశారు. దీనికి పరిపాలనాపరమైన అనుమతులు కూడా వచ్చేశాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం పూర్తిగా అటకెక్కింది.