
ఎమ్మెల్యే తాటిపర్తి, చుండూరి
ఒంగోలు సిటీ/యర్రగొండపాలెం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షుడు చుండూరి రవిబాబు తదితరులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ జగన్కు ప్రకాశం జిల్లా లీగల్ టీమ్ సభ్యులను చెవిరెడ్డి, చుండూరి పరిచయం చేశారు. లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, లీగల్ టీమ్ సభ్యులు ధర్నాసి హరిబాబు, కాకుటూరి సంపత్కుమార్, కత్తి కోటేష్బాబు, బి.నాగమల్లేశ్వరరెడ్డి, నాయకులు రాయపాటి అంకయ్య, మలిశెట్టి దేవ, పులుసు సురేష్ తదితరులు ఉన్నారు.

ఎమ్మెల్యే తాటిపర్తి, చుండూరి