
నా భర్తను కాపాడండి
సీఎం గారూ..
ఒంగోలు టౌన్: ‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారూ.. నా భర్త ప్రాణాలు కాపాడండి.. వైద్యపరంగా చికిత్స కోసం సాయం అందించండి’ అంటూ గిద్దలూరుకు చెందిన కందుల విజయలక్ష్మి వేడుకున్నారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద ఆమె పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి ప్లకార్డులు ప్రదర్శించారు. తన భర్త సురేంద్ర మార్కాపురానికి చెందిన సుబ్బారెడ్డి వద్ద లారీ కొనుగోలు చేశారని, రూ.2.25 లక్షలకు బేరం మాట్లాడుకుని రూ.1.50 లక్షల అడ్వాన్స్గా ఇచ్చారని వివరించారు. మిగతా డబ్బు ఫైనాన్స్ ద్వారా చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని, అయితే లారీ చూసి రావడానికి వెళ్లిన రోజే తమ లారీ ఒకటి ప్రమాదానికి గురవడంతో సురేంద్ర సెంటిమెంట్గా భావించారని, దాంతో లారీ వద్దని సుబ్బారెడ్డికి చెప్పినట్లు తెలిపారు. ఈ విషయంలో సుబ్బారెడ్డితో విభేదాలు రావడంతో పోలీసులతో కలిసి వేధిస్తున్నారని, మనస్తాపానికి గురైన తన భర్త గడ్డిమందు తాగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని విలపించారు. తన భర్త నంద్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నాడని, తమకు న్యాయం చేయాలని విన్నవించారు. ఇదిలా ఉండగా 2024 నవంబర్లో సురేంద్రకు లారీ విక్రయించినట్లు సుబ్బారెడ్డి చెబుతున్నారు. అప్పటి నుంచి ఫైనాన్స్ కిస్తీలు సక్రమంగా చెల్లించకుండా లారీ తిప్పకొంటున్నారని, ఫైనాన్స్ విషయంలో వచ్చిన సమస్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
పోలీసులపై ఆరోపణలు అవాస్తవం : డీఎస్పీ నాగరాజు
సురేంద్ర కుటుంబ సభ్యులు పోలీసుల మీద చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మార్కాపురం డీఎస్పీ నాగరాజు చెప్పారు. సురేంద్ర రెడ్డి ఒక లారీని మిస్సింగ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని, విచారణ నిమిత్తంి స్టేషన్కు పిపలిచారని వివరించారు. సురేంద్రను కొట్టలేదని, వివరాలు కనుక్కొని పంపించి వేశామన్నారు.