
ట్రాక్టర్ను ఢీకొట్టిన కంటైనర్ లారీ
టంగుటూరు: ట్రాక్టర్ను లారీ ఢీకొనడంతో నలుగురు పచ్చాకు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన టంగుటూరు మండలంలోని సూరారెడ్డిపాలెం వద్ద జాతీయ రహదారిపై బాబాయ్ హోటల్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సూరారెడ్డిపాలెం గ్రామానికి చెందిన నల్లగొర్ల అశోక్ ట్రాక్టర్లో పచ్చాకుతో సహా కూలీలను తీసుకుని తూర్పునాయుడుపాలెం వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఒంగోలు వైపు నుంచి చైన్నె వైపు వెళ్తున్న కంటైనర్ లారీ పచ్చాకు ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న వెంకటేశ్వర్లుకు కాలు విరగగా, జక్రయ్య, మార్కు, రాములుకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలాన్ని ఎస్సై నాగమళ్లీశ్వరరావు పరిశీలించారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. ట్రాక్టర్ను ఢీకొట్టిన కంటైనర్ లారీ ఆగకుండా వెళ్లిపోగా పోలీసులు గాలించి బోదనం టోల్గేట్ సమీపంలోని చిల్లకూరు వద్ద సీజ్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
నలుగురు పచ్చాకు కూలీలకు తీవ్ర గాయాలు