
మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం
కొమరోలు: తాటిచెర్లమోటు కారు ప్రమాదానికి మితిమీరిన వేగమే కారణమని మార్కాపురం డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. ఆర్టీఓ అల్లం మాధవరావుతో కలిసి శనివారం ఆయన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గురైన కారును క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సమయంలో కారు వేగం 120 కిలోమీటర్లు ఉందని స్పష్టం చేశారు. కారు వేగంగా వెళ్లి లారీని ఢీకొనడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పారు. వాహనాలను నిర్లక్ష్యంగా, వేగంగా ఎవరూ నడపొద్దని సూచించారు. నేషనల్ హైవే ప్రాజెక్టు మేనేజర్ మల్లికార్జునరెడ్డి, ఆర్అండ్బీ డీఈ ఎం.నరసింహులు, గిద్దలూరు, కంభం సీఐలు రామకోటయ్య, మల్లికార్జున, ఎస్సైలు రవీంద్రరెడ్డి, నాగరాజు, కోటేశ్వరరావు, సుదర్శన్ పాల్గొన్నారు.
ప్రమాద సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారు రాంగ్ రూటులో లారీని బలంగా ఢీకొట్టిన కారు వివరాలు వెల్లడించిన మార్కాపురం డీఎస్పీ నాగరాజు