కొనకనమిట్ల: వెలుగొండ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం శ్రీవారు అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన శ్రీవారి ఉత్సవమూర్తులను వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మేళతాళాల నడుమ ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. వేదపండితులు ప్రసాదాచార్యులు, భార్గవాచార్యులు స్వామివారికి అర్చనలు అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. గంగాభవాని సన్నిధితో పాటు బలిహోర గంగమ్మతల్లి ఆలయంలో భక్తులు పూజలు చేశారు. మంగళవారం పూర్ణాహుతి, వసంతోత్సవం, చక్రతీర్థం, ధ్వజ అవరోహణ, కుంబ ప్రోక్షణ కార్యక్రమాలు, శ్రీవారి ఉత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈఓ చెన్నకేశవరెడ్డి తెలిపారు.