ఇసుక టిప్పర్ బోల్తాపడి డ్రైవర్ మృతి
తాళ్లూరు: ఇసుక టిప్పర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన తాళ్లూరు–అవిశనపాలెం రోడ్డులో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..పోలవరం ఇసుక రేవు నుంచి ఇసుకను తీసుకువెళ్తున్న టిప్పర్ ప్రమాదవశాత్తు మట్టి రోడ్లో జారీ పక్కన ఉన్న గుంతలో పడిపోయింది. ప్రమాదంలో డ్రైవర్ పాటిబండ్ల పెద సుబ్బారావు(44)ను డోర్ను బలంగా గుద్దుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. దర్శి సీఐ రామకోటయ్య, ఎస్సై ప్రేమ్కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని కుమారుడు అజయ్బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిలకలేరు నుంచి నిత్యం గ్రామీణ రోడ్లలో అధిక లోడ్తో తిరుగుతున్న ఇసుక టిప్పర్లవల్లే ఇప్పటికే రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. బ్రిడ్జిలు కూడా కుంగిపోతున్నాయి.