సాక్షి, మెదక్: రాష్ట్ర సమస్యలపై సీఎం కేసీఆర్ కలిసి వస్తే ప్రధాని మోదీ దగ్గరకు తీసుకెళ్లి పరిష్కరిస్తాను అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. సీఎం కేసీఆర్కి ఢిల్లీ వెళ్లి వచ్చాక టెన్షన్ పట్టుకుందని పేర్కొన్నారు. ఫాంహౌస్ నుంచి సీఎం బయటకు రావడం లేదని తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆదివారం మెదక్ జిల్లాలో సంజయ్ మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు తర్వాత మేయర్ పదవి ఇస్తామని కేసీఆర్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిశారని తెలిపారు. అయితే మేయర్ పదవి వద్దు, 2023లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పినట్లు పేర్కొన్నారు. తలకిందకు, కాళ్లుపైకి చేసినా హుజురాబాద్లో టీఆర్ఎస్ గెలవదని స్పష్టం చేశారు.
చదవండి: ప్రతిభకు గుర్తింపు.. విద్యార్థులను ఆకాశాన తిప్పిన టీచర్
దళిత బంధుతో పాటు బీసీ, గిరిజన బంధు ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ భారత్లో చేరకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. రూ.10 వేలు కోట్లతో 2 లక్షల 91 వేలు ఇళ్లు రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందని వివరించారు. ఒక్కొక్క నిరుద్యోగికి ప్రభుత్వం రూ.లక్ష బాకీ ఉందని, రాష్ట్రంలో ప్రతి వ్యక్తి మీద రూ.లక్ష అప్పు ఉందని చెప్పారు. కేంద్రం నిధులతో రాష్ట్రం తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు.
చదవండి: బ్యాంక్కు నిద్రలేని రాత్రి.. అర్ధరాత్రి పాము హల్చల్
కేసీఆర్ కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించమని తెలంగాణ తల్లి ఘోషిస్తోందని పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లి ఒంగిఒంగి దండాలు పెట్టాడు.. హుస్సేన్సాగర్లో వినాయక నిమజ్జనం చేసి తీరుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం కోర్టుకి వెళ్లి వినాయక నిమజ్జనానికి అనుమతి తీసుకోవాలని సూచించారు.
కేసీఆర్ వస్తే ప్రధాని వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తా: బండి సంజయ్
Published Sun, Sep 12 2021 7:20 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement