మోదీజీ.. అదే నిజమైతే మీ చిత్తశుద్ది నిరూపించుకోండి.. రేపిస్టులకు బెయిల్ రాకుండా చేయండి: మంత్రి కేటీఆర్
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ దోషులను.. రెమిషన్ ఆదేశాల కింద గుజరాత్ సర్కార్ విడుదల చేయడంపై దేశం భగ్గుమంటోంది. గుజరాత్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటుండగా.. విపక్షాలు, మేధోవర్గం ఈ విషయంలో గుజరాత్ ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని ఏకీపడేస్తున్నాయి. ఈ క్రమంలో.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సైతం ట్విటర్ వేదికగా స్పందించారు.
ప్రియమైన మోదీగారు.. మహిళల గౌరవం గురించి మీరు మాట్లాడడం నిజమే అయితే.. ఈ విషయంలో జోక్యం చేసుకోండి. పదకొండు మంది రేపిస్టులను విడుదల చేసిన గుజరాత్ ప్రభుత్వపు ఆదేశాలను రద్దు చేయించండి. ఈ దేశాలు వెగటు పుట్టించేవిగా ఉన్నాయి. మీరు జోక్యం చేసుకుని చిత్తశుద్ధి చూపించాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు కేటీఆర్.
Dear PM @narendramodi Ji,
If you had really meant what you spoke about Respecting women, urge you to intervene & rescind the Gujarat Govt remission order releasing 11 Rapists 🙏
Sir, it is nauseating to put it mildly & against MHA order. Need you to show sagacity to the Nation
— KTR (@KTRTRS) August 17, 2022
అంతేకాదు.. సార్.. ఐపీసీ, సీఆర్పీసీలో రేపిస్టులకు బెయిల్ దొరక్కుండా ఉండేందుకు సవరణలు చేయాల్సిన అవసరం ఉందని, బలమైన చట్టాలతోనే న్యాయవ్యవస్థ పటిష్టంగా, వేగంగా పని చేస్తుందని మరో కొనసాగింపు ట్వీట్లో పేర్కొన్నారు కేటీఆర్.
ఇదీ చదవండి: మోదీ పాతికేళ్ల లక్ష్యాలు భేష్..: కేటీఆర్